Taj Mahal: తాజ్మహల్పై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ.. కేంద్రానికి నోటీసులు
- తాజ్మహల్పై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ
- కేంద్రానికి, పురావస్తు శాఖకు నోటీసులు
- అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజ్మహల్ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ జరిపింది. తాజ్మహల్ను హిందూ దేవాలయంగా ప్రకటించాలా? వద్దా అన్న అంశంపై విచారించింది. ఈ సందర్భంగా తాజ్మహల్పై సర్వే జరపాలా? అనేదానిపై కేంద్రానికి, భారత పురావస్తు శాఖకు నోటీసులు జారీ చేసింది. తాజ్మహల్పై శాస్త్రీయ సర్వే నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశించింది.
2015లో ఆగ్రా సివిల్ కోర్టులో దాఖలైన డిక్లరేటరీ సూట్. ‘లార్డ్ శ్రీ అగ్రేశ్వర్ మహాదేవ్ నాగ్నాథేశ్వర్ విరాజ్మాన్ తేజో మహాలయ మందిర్’ తరఫున పిటిషనర్లు తాజ్మహల్ సముదాయాన్ని హిందూ ఆలయంగా గుర్తించాలని కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ను దిగువ కోర్టు కొట్టేసింది. ఈ అభ్యర్థనను ఆగ్రా ట్రయల్ కోర్టు తిరస్కరించింది. అనంతరం దాఖలైన రివిజన్ పిటిషన్ను కూడా అదనపు జిల్లా న్యాయమూర్తి నిర్వహణపరమైన కారణాలతో కొట్టివేశారు. దీంతో హైకోర్టును ఆశ్రయించారు.
Also Read
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
- Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
దీంతో న్యాయమూర్తి రోహిత్ రంజన్ అగర్వాల్ ఈ కేసును విచారిస్తూ కేంద్ర ప్రభుత్వం, ఏఎస్ఐ తమ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. అలాగే ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న పంకజ్ కుమార్ వర్మకు కూడా నోటీసులు జారీ చేశారు. ఇక పిటిషనర్ల తరఫున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సీనియర్ న్యాయవాది హరి శంకర్ జైన్.. దిగువ కోర్టులు సర్వే అభ్యర్థనను తిరస్కరించడం సరైన నిర్ణయం కాదని వాదించారు. తాజ్మహల్ చారిత్రక స్వరూపాన్ని నిర్ధారించడానికి శాస్త్రీయ సర్వే, ఫొటోగ్రాఫిక్ డాక్యుమెంటేషన్ తప్పనిసరి అని కోర్టుకు తెలిపారు. కేసు విచారణ సందర్భంగా పిటిషనర్లు తాజ్మహల్ ప్రాంగణంలో అడ్వకేట్ కమిషనర్ను నియమించి సర్వే నిర్వహించడంతో పాటు ఫొటోగ్రాఫిక్, శాస్త్రీయ ఆధారాలను సేకరించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే తాజా విచారణలో అలహాబాద్ హైకోర్టు తాజ్మహల్ ఆలయమా? కాదా? అనే అంశంపై ఎలాంటి తుది తీర్పు ఇవ్వలేదు. ప్రస్తుతం సర్వే అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వం, ఏఎస్ఐ తమ అధికారిక వైఖరిని కోర్టుకు తెలియజేయాలని మాత్రమే ఆదేశించింది. దీంతో ఈ వివాదంలో న్యాయపరమైన ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది.
తాజావార్తలు
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!