Swati Maliwal: కేజ్రీవాల్ పంజాబ్ ‘‘సూపర్ సీఎం’’.. శీష్ మహల్ 2.0పై స్వాతి మలివాల్ విమర్శలు..
- కేజ్రీవాల్పై ‘‘శీష్ మహల్ 2.0’’ ఆరోపణలు..
- కేజ్రీవాల్ పంజాబ్ ‘‘సూపర్ సీఎం’’గా అని స్వాతి మలివాల్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal: ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై శీష్ మహల్2.0 ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల ముందు ఆయన విలాసవంతమైన భవనం వివాదంగా మారింది. అయితే, ఇప్పుడు ఛండీగఢ్లో కూడా ఇలాంటి భవనాన్ని ప్రభుత్వం కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఆప్ తిరుగుబాటు నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ పంజాబ్ ‘‘సూపర్ సీఎం’’గా పనిచేస్తున్నారని, షీష్ మహల్ ఇచ్చినట్లు మాన్ అంగీకరించారని మలివాల్ ఆరోపించారు.
ప్రభుత్వం ఆస్తిని ఉపయోగించడం గురించి మాట్లాడుతూ.. పంజాబ్ పరిపాలన దాని ప్రస్తుత స్థితి, ఖర్చు,నివాసితులకు సంబంధించి పూర్తి బహిర్గతం చేయాలని మలివాల్ డిమాండ్ చేశారు. శీష్ మహల్ ఆరోపణలను భగవంత్ మాన్ తోసిపుచ్చిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిజమైన శీష్ మహల్స్ బీజేపీ నేత కెప్టెన్ అమరిందర్ సింగ్, ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్కు చెందినవని పేర్కొన్నారు.
Also Read
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
Read Also: Accident : అమెరికాలో కారు ప్రమాదం.. ఏపీకి చెందిన భార్యాభర్తలు మృతి
“భగవంత్ మాన్ జీ, మీరు ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ జీని పంజాబ్ సూపర్ సీఎంగా గుర్తించారు, అందుకే మీరు ఆయన రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారు. మీ స్వంత ప్రకటనలో, కేజ్రీవాల్ ఈ ఇంట్లో నివసిస్తున్నారని మీరు అంగీకరించారు. నేను చెప్పేది కూడా అదే.” అని స్వాతి మలివాల్ పోస్ట్ చేశారు. “ఎవరి ఆదేశాల మేరకు సీఎం క్యాంప్ ఆఫీస్ను అతిథి గృహంగా మార్చారు? దానిని బుక్ చేసుకునే విధానం ఏమిటి? గత మూడు సంవత్సరాలుగా అక్కడ ఎవరు అతిథులుగా బస చేశారు, ఏ ప్రాతిపదికన ప్రభుత్వ సౌకర్యంలో ఉచితంగా ఉండటానికి అనుమతిస్తున్నారు?” అని ఆమె ప్రశ్నించారు.
ఢిల్లీలో శీష్ మహల్ కోల్పోయిన తర్వాత పంజాబ్లోని తన పార్టీ ప్రభుత్వం చండీగఢ్ లో 2 ఎకరాల్లో విస్తరించి ఉన్న విలాసవంతమైన 7-స్టార్ ప్రభుత్వ భవనాన్ని కేజ్రీవాల్కు అందించిందని బీజేపీ పేర్కొంది. ఢిల్లీలో శీష్ మహల్ తర్వాత, కేజ్రీవాల్ చండీగఢ్ శీష్ మహల్ 2.0ని సిద్ధం చేశారని, దీనికి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని, పంజాబ్ ప్రభుత్వం ఈ అద్భుతమైన బంగ్లాను అతడికి ఏ కోటా కింద అందించిందో తెలియదని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా అన్నారు. కేజ్రీవాల్ పంజాబ్ ఎంపీ లేదా ఎమ్మెల్యే కాదని అన్నారు.
తాజావార్తలు
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్లకు గుడ్న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
-
Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
-
Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
-
Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!