Delhi: సీఎం అతిషి ఇంటి ముందు ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న నిరసన
- సీఎం అతిషి ఇంటి ముందు ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న నిరసన
- మురికి నీళ్ల బాటిల్తో ఆందోళన
- 15 రోజుల్లో పరిస్థితులు మారకపోతే తీవ్రంగా ఉంటుందని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి అతిషి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మురికినీళ్లతో నిండిన బాటిల్ను తీసుకొచ్చి ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలకు ఇలాంటి నీళ్లేనా? సరఫరా చేసేదంటూ ఆమె నిలదీశారు. ఈ మేరకు ఆమె మురికినీళ్లకు సంబంధించిన వాటర్ను అతిషి ఇంటి ముందు పారబోసి.. బాటిల్ గేటు ముందు పెట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అతిషి వర్సెస్ స్వాతి అన్నట్టుగా మారింది. అయితే బీజేపీ స్వాతి వెనుకుండి కథ నడిపిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది.
ఇది కూడా చదవండి: Tirupati Crime: లాడ్జిలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. యువకుడు అరెస్ట్
Also Read
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
స్వాతి మాలివాల్ మీడియాతో మాట్లాడుతూ.. సాగర్పూర్, ద్వారక ప్రజలు తనకు ఫోన్ చేశారని.. దీంతో తాను అక్కడికి వెళ్లానని చెప్పారు. ఆ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఓ ఇంటి దగ్గరకు వెళ్లి నల్లా విప్పి బాటిల్ పడితే ఇలాంటి నీళ్లు వచ్చాయని వివరించారు. నల్లాల్లో సరఫరా అవుతున్న నీరు నల్లగా, కలుషితంగా ఉందని చెప్పారు. అదే నీటిని ఇప్పుడు సీఎం అతిషి ఇంటికి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా?.. వాడుకుంటారా?. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల కష్టాలు మాత్రం తీరడం లేదని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Winter: శీతాకాలంలో చిన్నారుల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలివే!
‘‘ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇదే నా హెచ్చరిక. రానున్న 15 రోజుల్లో ఢిల్లీలో ప్రతీ ఇంటికి మంచి నీరు అందాలి. లేని పక్షంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇవే నీటిని ట్యాంకర్లో నింపి సీఎం నివాసం దగ్గర పారబోస్తాం. ఇప్పుడు కేవలం ఒక్క బాటిల్ నీటిని మాత్రమే వేస్తున్నాను. ఇది కేవలం శాంపిల్ మాత్రమే.’’ అని స్వాతి మాలివాల్ వార్నింగ్ ఇచ్చారు.
अभी द्वारका विधानसभा के एक Retired Army officer के घर आई थी, महीनों से पूरे इलाक़े में गंदा बदबूदार पानी आ रहा है।
दिवाली पर CM @AtishiAAP ने इनके घर पर नल से सीधा Coca Cola सप्लाई करवाई है। हज़ारों परिवारों की दिवाली बर्बाद हो गई।
ये पानी की बोतल अभी दिवाली के गिफ्ट के रूप… pic.twitter.com/TJNEk4sb1l
— Swati Maliwal (@SwatiJaiHind) November 2, 2024
#WATCH | AAP MP Swati Maliwal arrives at Delhi CM Atishi's residence with a bottle filled with polluted water and throws it outside the CM's residence. She is claiming that this water is being supplied to the people of Delhi pic.twitter.com/ERJpqowuZX
— ANI (@ANI) November 2, 2024
#WATCH | Delhi | AAP Rajya Sabha MP Swati Maliwal says, "The people of Sagarpur, Dwarka had called me and the situation there is very bad… I went to a house and black water was being supplied there. I filled that black water in a bottle and I brought that water here, at the… https://t.co/FN3JgtYUXn pic.twitter.com/2twrYzVlO8
— ANI (@ANI) November 2, 2024
తాజావార్తలు
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!