Qatar-India: “మా సైనిక శిక్షణే కారణం”.. ఖతార్ ఉరిశిక్ష నుంచి బయటపడిన మాజీ నేవీ సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Qatar-India: ఖతార్ దేశంలో గూఢచర్యం ఆరోపణలతో ఉరిశిక్ష విధించబడిన 8 మంది భారత మాజీ నేవీ అధికారులు, శిక్ష నుంచి బయటపడ్డారు. ఇటీవల వారంతా భారతదేశానికి వచ్చారు. మోడీ ప్రభుత్వ హాయాంలో ఇది అతిపెద్ద దౌత్య విజయంగా భావించబడుతోంది. జలంతర్గామి నిర్మాణంలో ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యానికి పాల్పడుతున్నారని చెబుతూ ఖతార్ కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. భారత ప్రభుత్వం కలుగజేసుకుని వారిని శిక్ష నుంచి తప్పించగలిగింది.
ఈ నేపథ్యంలో భారత్ తిరిగి వచ్చిన మాజీ నేవీ అధికారి తన అనుభవానలు చెప్పారు. రాగేష్ గోపకుమార్ అక్కడి జైళ్లలో కొన్ని నెలల పాటు శిక్ష అనుభవించారు. తాను తిరిగి సొంత ఊరు తిరువనంతపురం చేసుకోవడంతో భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబంతో తిరిగి కలుస్తున్నందుకు ఆనందం మరియు కృతజ్ఞతలు తెలిపారు. తాను, తన సహచరులు తమ సైనిక శిక్షణ కారణంగా మానసికంగా ధృడంగా ఉన్నామని, ఈ శిక్షణ మాకు ఉపయోగపడిందని, బతికిపోయామని చెప్పారు.
Also Read
- BJP Presidents: నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ.!
- Siddaramaiah Resignation: ముగిసిన సిద్ధరామయ్య శకం.. భారతీయ లోక్ దళ్ నుంచి కాంగ్రెస్ దాకా.. 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఇదే..
- Karnataka Power Tussle: సీఎం పదవి నుంచి దిగిపోయేలా సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ఒప్పించింది?
- Siddaramaiah: "నేను మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. నాకు ఎలాంటి బాధ లేదు".. సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..
గోపకుమార్ సోమవారం తిరువనంతపురానికి 16 కిలోమీటర్ల దూరం ఉన్న బలరామపురానికి చేరుకున్నారు. కుటుంబాన్ని చూడగానే ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. రోజూ ఐదారుసార్లు ఫోన్ చేసే భర్త, తన భార్యకు ఫోన్ చేయడం మానేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆరా తీసిన సమయంలో, తన కుటుంబం ఎంత దీనస్థితిలో ఉందో అర్థమయ్యేదని, తన కుటుంబ ప్రార్థనలు, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాల వల్లే తాము మళ్లీ స్వదేశానికి వచ్చామని అన్నారు. తమను విడిపించేందుకు చొరవ తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీజీ జోక్యం చేసుకుంటే తిరిగి స్వదేశానికి వస్తామని తెలుసని, అయితే ఎన్ని రోజులు పడుతుందో తెలియదని గోపకుమార్ అన్నారు.
Read Also: Ramam Raghavam: నా ప్రేమ మొదలయ్యింది నీతోనే డాడీ.. ధనరాజ్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యేలానే ఉన్నాడు
ఒక భారతీయ వ్యక్తి అమాయకుడై, విదేశాల్లో జైలు శిక్ష విధించబడితే, మన ప్రధాని ఆదుకుంటారని, ఈ విషయాన్ని ప్రతీ భారతీయులు తెలుసుకోవాలని ఆయన అన్నారు. 2017లో ఇండియన్ నుంచి రిటైర్ అయినట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత ఒమన్ డిఫెన్స్ ట్రైనింగ్ కంపెనీలో కమ్యూనికేషన్స్ ఇన్స్ట్రక్టర్గా చేరానని గోపకుమార్ తెలిపారు.
గతేడాది అక్టోబర్ 26న 8 మందికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ శిక్షను డిసెంబర్ 28న మరణశిక్ష నుంచి మూడు నుంచి 25 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది. గతేడాది డిసెంబర్ నెలలో దుబాయ్లో జరిగిన COP28 సమ్మిట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో సమావేశమై దీనిపై చర్చించారు.
తాజావార్తలు
-
Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
-
Jofra Archer: వైభవ్ సూర్యవంశీ విధ్వంసంను ఎలా ఆపాలి.. ఆర్ఆర్ పేసర్ ఆర్చర్ ఏం చెప్పాడంటే?
-
BJP Presidents: నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ.!
-
Siddaramaiah Resignation: ముగిసిన సిద్ధరామయ్య శకం.. భారతీయ లోక్ దళ్ నుంచి కాంగ్రెస్ దాకా.. 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఇదే..
-
RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..