Delhi Elections: ఆప్ అంచనాలు తల్లకిందులవుతున్నాయా? దానికి కారణమిదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎవరికి గుణపాఠం నేర్పిస్తున్నాయి. ఎవరికి లాభం చేకూరుస్తున్నాయి. తేలాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. హస్తినలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 60 శాతం పోలింగ్ కూడా నమోదైంది. ఇక ఫలితాలు శనివారం విడుదలకానున్నాయి. అయితే ఆప్ అంచనాలు ఈసారి తల్లకిందులవుతున్నట్లుగా సర్వేలు కోడైకూస్తున్నాయి. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.
ఇది కూడా చదవండి: WhatsApp: త్వరలో వాట్సాప్ ద్వారా నీరు, విద్యుత్, గ్యాస్ బిల్లులు చెల్లింపులు..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే ఆప్ ప్రజల్లోకి దూసుకెళ్లింది. ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రజల్లోకి చొచ్చుకెళ్లి ఉచిత హామీలు ఇచ్చుకుంటూ వెళ్లారు. అన్ని వర్గాల ప్రజలకు తాయిలాలు ప్రకటించుకుంటూ వెళ్లారు. అయితే బీజేపీ కూడా అంతకు పైఎత్తు వేసింది. ఆప్ బాటలోనే బీజేపీ కూడా వెళ్లింది. మూడు దశలుగా మేనిఫెస్టో విడుదల చేసింది. అన్ని ఉచిత హామీలు కుమ్మరించింది. దీంతో కొంత ఓటు బ్యాంక్.. బీజేపీ వైపు డైవర్ట్ అయింది.
ఇది కూడా చదవండి: Komatireddy Venkat Reddy : దేశంలో మొట్ట మొదటి సారి కుల గణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచాం
ఇక ఢిల్లీ వాసులు కూడా మార్పు కోరుకుంటున్నారని తాజా సర్వేలను బట్టి తెలిసింది. ఇన్నాళ్లూ ఆప్ ప్రభుత్వాన్ని చూశాం కదా? ఈసారి బీజేపీకి ఓటు వేద్దామని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఓ వైపు బీజేపీ కూడా ఉచిత హామీలు.. ఇంకోవైపు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్.. మరోవైపు ప్రజలు మార్పు కోరుకోవడం.. ఇలా ఆప్కు ఓట్లు గండిపడ్డాయి. అంతేకాకుండా లిక్కర్ స్కామ్ కూడా పెద్ద మైనస్గానే చెప్పొచ్చు. అలాగే స్వాతి మాలివాల్పై భౌతిక దాడి జరగడం కూడా ఒక మైనస్గా చెప్పక తప్పదు. అందుకోసమే 49 శాతం ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడం వల్ల 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ అధికారంలోకి రాబోతోందని సర్వేలు అంచనా వేశాయి. ఆప్ రెండో స్థానంలో ఉండగా.. కాంగ్రెస్కు జీరో సీట్లు వస్తాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అసలు ఫలితాలు తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
ఇది కూడా చదవండి: Minister Seethakka : దేశంలో ఏ రాష్ట్రం కులగణన చేయలేదు.. మనమే కులగణన చేసి చూపెట్టినం
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!