PM Modi: ప్రతిపక్షాలకు ఇది చెంపదెబ్బ.. వీవీప్యాట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని..
PM Modi: ఈవీఎం-వీవీప్యాట్లపై దాఖలైన పిటిషన్లను ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓటర్ వేరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్)లోని స్లిప్పులను, ఈవీఎంలో నమోదైన ఓట్లతో క్రాస్ చేక్ చేయాలని కోరుతూ పలువురు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, వీటిన్నింటి సుప్రీంకోర్టు ఈ రోజు తోసిపుచ్చింది. సుప్రీం తీర్పుపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఇది ప్రతిపక్షాలకు ఝలక్ అని, చెంపదెబ్బగా అభివర్ణించారు. ప్రతిపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బీహార్లోని ఆరారియా ఎన్నికలల ర్యాలీలో ప్రసంగించిన పీఎం ఈ వ్యాఖ్యాలు చేశారు. ‘‘ఈ రోజు మన ప్రజాస్వామ్యానికి శుభదినం, ఈవీఎంలపై ఏడ్చే ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది’’ అని అన్నారు. వీవీప్యాట్లతో ఈవీఎంలో నమోదైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిస్టమ్లోని ఏదైనా విషయాన్ని గుడ్డిగా అవిశ్వసించడం వల్ల అనవసరమైన సందేహాలను తలెత్తుతాయని పేర్కొంది.
Also Read
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
- Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
- Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని
Read Also: Yodha OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాశిఖన్నా యాక్షన్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
‘‘ప్రజాస్వామ్యం అనేది అన్ని సంస్థల మధ్య సామరస్యాన్ని, విశ్వాసాన్ని పెంపొందించడానికి కృషి చేయడమే’’ అని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం రెండు సమ్మతమైన తీర్పులను వెలువరించింది. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలనే వారి అభ్యర్థనను తోసిపుచ్చింది.
మరోవైపు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల, ఓబీసీ హక్కులను హరించడానిక కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని ప్రధాని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను చాలా బాధ్యతతో చెబుతున్నానని అన్నారు. ‘‘భారతదేశంలో మతపరమైన రిజర్వేషన్లు ఉండవని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. అయితే, కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లను అమలు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిసోంది. దేశంలో కర్ణాటక మోడల్ రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చి కాంగ్రెస్ వారిని మోసం చేస్తోంది’’ ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
Jowar Chilla Recipe: జొన్న పిండితో 10 నిమిషాల్లో కరకరలాడే హెల్దీ చిల్లా.. పిల్లలు, పెద్దలు ఎవరూ విడిచిపెట్టరు అంతే..!
-
Kerala Story 2 OTT: ‘కేరళ స్టోరీ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
-
Duvvada Madhuri: టాలీవుడ్ మూవీలో అత్తగా దువ్వాడ మాధురి
-
iQOO 9 SE: 48MP OIS కెమెరా + 120Hz AMOLED – ఐకూ 9 SE ఇప్పుడు అతి చౌకగా! డీల్ మిస్ కాకండి!
-
Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!