Supreme Court: తమిళనాడు గవర్నర్కు సుప్రీం ధర్మాసనం చీవాట్లు
- తమిళనాడు గవర్నర్కు సుప్రీం ధర్మాసనం చీవాట్లు
- బిల్లులు ఆమోదించకుండా నిలిపివేయడంపై అసహనం
- ఈ చర్య చట్ట విరుద్ధం అంటూ ధర్మాసనం వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్.రవికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10కిపైగా బిల్లులను నిలిపివేయడంపై తీవ్రంగా తప్పుపట్టింది. ఈ చర్య చట్ట విరుద్ధం అంటూ సుప్రీం ధర్మాసనం చీవాట్లు పెట్టింది. బిల్లులు నిలిపివేసిన తేదీ దగ్గర నుంచి ఆమోదం పొందినట్లు పరిగణించబడుతుందని జస్టిస్ జెబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో స్టాలిన్ ప్రభుత్వం ఘన విజయం సాధించింది.
ఇది కూడా చదవండి: Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. 15 రోజులకే భర్తకు దిమ్మతిరిగే షాకిస్తూ..
Also Read
- Meenakshi Natarajan: "మేము జోక్యం చేసుకోలేం".. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి ఎదురుదెబ్బ
- Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
స్టాలిన్ ప్రభుత్వం పంపించిన 10 కీలక బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ ఆర్ఎన్.రవి అడ్డుకున్నారు. ఈ చర్యను స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా విచారించిన న్యాయస్థానం.. గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. గవర్నర్ చర్య చట్ట విరుద్ధం, ఏకపక్షం అంటూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్యలు పక్కన పెడుతున్నట్లు కోర్టు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Trump-Musk: చైనా సుంకాలపై మస్క్ అభ్యంతరం.. ట్రంప్నకు కీలక సూచన
10 బిల్లులను రిజర్వ్ చేయాలని రాష్ట్రపతికి గవర్నర్ సూచించారు. కీలక బిల్లులు ఆమోదం పొందక పోవడంతో స్టాలిన్ ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ప్రభుత్వం ఆశ్రయించడంతో సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్యను పక్కన పెడుతూ.. గవర్నర్ నిలిపివేసిన దగ్గర నుంచి ఆమోదం పొందినట్లుగా సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
ఇది కూడా చదవండి: Brahma Kumaris Chief: బ్రహ్మకుమారిస్ చీఫ్ దాది రతన్ మోహని కన్నుమూత..
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తర్వాత గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను.. మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఆమోదించి పంపితే గవర్నర్ ఆమోదించినట్లుగా పరిగణించాలని న్యాయస్థానం తెలిపింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాశ్వతంగా గవర్నర్లు తమ దగ్గర ఉంచుకోలేరని తేల్చి చెప్పింది. అయినా బిల్లులను ఆమోదించకుండా.. రాష్ట్రపతికి పంపించడం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించినట్లుగా కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. 2020, జనవరి నుంచి 12 బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతికి సిఫార్సు చేయడం ఇది కచ్చితంగా చట్ట విరుద్ధమని సుప్రీం ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Google Maps: గూగుల్ మ్యాప్స్లో ఈ చిన్న సెట్టింగ్ మార్చండి.. పెట్రోల్ ఖర్చు తగ్గించుకోండి!
-
Pawan Kalyan: 21 సీట్లతో రాజీపడలేదు.. ఏపీ కోసం మేం త్యాగం చేశాం!
-
China Robot: చైనా రోబోలు.. భారత్కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
-
Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!