Supreme Court: హద్దులు దాటుతున్నారు.. ఈడీ దాడులపై తీవ్ర ఆగ్రహం
- హద్దులు దాటుతున్నారు
- ఈడీ దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం సంస్థ టాస్మాక్పై చేస్తున్న ఈడీ దాడులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఈడీ అన్ని హద్దులు దాటిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్.. కేంద్ర సంస్థకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం.. రాష్ట్రంలో ఈడీ చర్యలు అసమానమైనవిని.. అంతేకాకుండా రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి: Komatireddy Venkat Reddy : బేగంపేట స్టేషన్ ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపిస్తోంది
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
తమిళనాడులో రూ.1,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని ఈడీ ఆరోపించింది. మద్యం సరఫరా ఆర్డర్లను పొందడానికి డిస్టిలరీలు లెక్కల్లో చూపని నగదు ఇచ్చాయని పేర్కొంది. దీంతో తమిళనాడులో ఈడీ దాడులు చేస్తోంది. దీన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్ కొట్టేస్తూ ఈడీ దాడులకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సరైన ఆధారాలు లేకుండా ఈడీ దర్యాప్తు చేస్తోందని.. టాస్మాక్ సిబ్బందిని.. మహిళలను వేధిస్తున్నారని… గోప్యత.. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని పిటిషన్లో పేర్కొంది. గురువారం పిటిషన్ విచారించిన ధర్మాసనం.. తక్షణమే దాడులు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఈడీ దాడులపై మండిపడింది. ఈడీ హద్దులు దాటి ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Vijay Sethupathi : ఘనంగా జరిగిన ‘ఏస్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
సుప్రీంకోర్టు తీర్పుపై డీఎంకే ప్రభుత్వం హర్హం వ్యక్తం చేసింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని ధ్వజమెత్తింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈడీ దాడులకు కేంద్రం ఉసిగొల్పుతోందని ఆరోపించింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!