Puja Khedkar: కనుమ రోజున పూజా ఖేద్కర్కు గుడ్న్యూస్.. అరెస్ట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- కనుమ రోజున పూజా ఖేద్కర్కు గుడ్న్యూస్
- అరెస్ట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కనుమ పండుగ రోజున మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఫిబ్రవరి 14 వరకు పూజా ఖేద్కర్ను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్లు బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వానికి, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Gautam Gambhir: టీమిండియా బౌలింగ్ కోచ్తో గౌతమ్ గంభీర్కు విభేదాలు?
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
గతేడాది పూజా ఖేద్కర్ ఉద్యోగం పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ్న్నారు. పూణెలో ట్రైనీ ఐఏఎస్గా పని చేస్తున్నారు. ట్రైనీగా ఉన్నప్పుడు సౌకర్యాలు ఏమీ ఉండవు. కానీ ఆమె మాత్రం తన తండ్రితో కలిసి అధికారుల్ని బెదిరించి.. గొంతెమ్మ కోర్కెలు కోరింది. సకల మర్యాదలు, సౌకర్యాలు కల్పించాలంటూ సిబ్బందికి హుకుం జారీ చేసింది. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. అనంతరం పూణె నుంచి ట్రాన్స్పర్ అయింది. అప్పుడే ఆమె బండారం బయటపడింది. తప్పుడు పత్రాలు సృష్టించి ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యూపీఎస్సీ విచారణ చేపట్టగా నిజమని తేలింది. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Daaku Maharaaj : డాకు నిలువు దోపిడీ.. 3 రోజుల్లో ఎన్ని కోట్లు అంటే?
రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికి 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ దరఖాస్తులో తప్పుడు సమాచారాన్ని నమోదు చేసినట్లుగా తేలింది. ఓబీసీ, దివ్యాంగుల కోటాను దుర్వినియోగం చేసినట్లుగా బయటపడింది. తప్పుడు పత్రాలతో ఉద్యోగం సంపాదించడంతో ఆమె సర్వీసును యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్లో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా వేటు వేసింది. ఇక ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడంతో.. అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును పూజా ఖేద్కర్ ఆశ్రయించింది. కానీ కోర్టు మాత్రం చీవాట్లు పెట్టింది. దేశం మొత్తాన్ని మోసం చేశారంటూ న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసి బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. దీంతో ఆమె మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఫిబ్రవరి 14 వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఢిల్లీ ప్రభుత్వానికి, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Man Shoots Daughter: పెళ్లికి 4 రోజుల ముందు కూతురిని కాల్చి చంపిన తండ్రి.. కారణం ఏంటంటే..
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!