Puja Khedkar: కనుమ రోజున పూజా ఖేద్కర్కు గుడ్న్యూస్.. అరెస్ట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- కనుమ రోజున పూజా ఖేద్కర్కు గుడ్న్యూస్
- అరెస్ట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కనుమ పండుగ రోజున మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఫిబ్రవరి 14 వరకు పూజా ఖేద్కర్ను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్లు బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వానికి, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Gautam Gambhir: టీమిండియా బౌలింగ్ కోచ్తో గౌతమ్ గంభీర్కు విభేదాలు?
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
గతేడాది పూజా ఖేద్కర్ ఉద్యోగం పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ్న్నారు. పూణెలో ట్రైనీ ఐఏఎస్గా పని చేస్తున్నారు. ట్రైనీగా ఉన్నప్పుడు సౌకర్యాలు ఏమీ ఉండవు. కానీ ఆమె మాత్రం తన తండ్రితో కలిసి అధికారుల్ని బెదిరించి.. గొంతెమ్మ కోర్కెలు కోరింది. సకల మర్యాదలు, సౌకర్యాలు కల్పించాలంటూ సిబ్బందికి హుకుం జారీ చేసింది. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. అనంతరం పూణె నుంచి ట్రాన్స్పర్ అయింది. అప్పుడే ఆమె బండారం బయటపడింది. తప్పుడు పత్రాలు సృష్టించి ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యూపీఎస్సీ విచారణ చేపట్టగా నిజమని తేలింది. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Daaku Maharaaj : డాకు నిలువు దోపిడీ.. 3 రోజుల్లో ఎన్ని కోట్లు అంటే?
రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికి 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ దరఖాస్తులో తప్పుడు సమాచారాన్ని నమోదు చేసినట్లుగా తేలింది. ఓబీసీ, దివ్యాంగుల కోటాను దుర్వినియోగం చేసినట్లుగా బయటపడింది. తప్పుడు పత్రాలతో ఉద్యోగం సంపాదించడంతో ఆమె సర్వీసును యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్లో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా వేటు వేసింది. ఇక ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడంతో.. అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును పూజా ఖేద్కర్ ఆశ్రయించింది. కానీ కోర్టు మాత్రం చీవాట్లు పెట్టింది. దేశం మొత్తాన్ని మోసం చేశారంటూ న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసి బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. దీంతో ఆమె మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఫిబ్రవరి 14 వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఢిల్లీ ప్రభుత్వానికి, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Man Shoots Daughter: పెళ్లికి 4 రోజుల ముందు కూతురిని కాల్చి చంపిన తండ్రి.. కారణం ఏంటంటే..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!