Supreme Court: రాహుల్ గాంధీకి శిక్ష విధించిన జడ్జీకి ప్రమోషన్.. స్టే విధించిన సుప్రీం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ‘మోడీ ఇంటిపేరు’ వివాదంలో రాహుల్ గాంధీకి శిక్ష విధించిన సూరత్ కోర్టు న్యాయమూర్తితో పాటు గుజరాత్ రాష్ట్రంలో కింది కోర్టుల్లో పనిచేస్తున్న 68 మంది న్యాయమూర్తులకు ప్రమోషన్లు ఇవ్వడంపై స్టే విధించింది. సూరత్ కోర్టు న్యాయమూర్తి హరీష్ హస్ముఖ్ భాయ్ వర్మ కూడా ఇందులో ఉన్నారు. వీరి ప్రమోషన్లు చట్ట వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. హరీష్ హస్ముఖ్ భాయ్ తో సహా 68 మంది న్యాయమూర్తులు జిల్లా జడ్జీ క్యాడర్ కు ప్రమోట్ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ లో గుజరాత్ హైకోర్ట్ సెలక్షన్ జాబితాను జారీ చేసింది.
అయితే ఈ సెలక్షన్ జాబితాను సవాల్ చేస్తూ సివిల్ జడ్జీ క్యాడర్ కు చెందిన ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘మెరిట్ కమ్ సీనియారిటీ’ ఆధారంగా కాకుండా ‘సీనియారిటీ కమ్ మెటిట్’ ఆధారంగా నియమకాలు చేపట్టారని ఆరోపించారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు, గుజరాత్ ప్రభుత్వం, హైకోర్టు రిజిస్టార్ జనరల్ కు నోటీసులు జారీ చేసింది. అయితే కోర్టు నుంచి నోటీసులు వచ్చినప్పటికీ గుజరాత్ ప్రభుత్వం ఆ న్యాయమూర్తులకు ప్రమోషన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
Read Also: Largest Cosmic Explosion: విశ్వంలో అతిపెద్ద పేలుడు.. మాటలకందని విస్పోటనం
అయితే తాజాగా దీనిపై మరోసారి విచారణ జరిగిన సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు కోర్టులో పెండిగ్ లో ఉందని తెలిసి కూడా ప్రభుత్వం వారికి ప్రమోషన్లు ఇవ్వడం దురదృష్టకరమని కోర్టు తెలిపింది. ‘‘కోర్టు నిర్ణయానికి విరుద్ధంగా న్యాయమూర్తులకు ప్రమోషన్లు కల్పించడం చట్టవిరుద్ధం, ఆ ప్రమోషన్ల జాబితాపై స్టే విధిస్తున్నాం. పదోన్నతి పొందిన న్యాయమూర్తులు తిరిగి వారి స్థానాలకు వెళ్లాలి.’’ అని సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ధర్మాసనం తదుపరి విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది.
2019 లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ప్రచారం చేస్తూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మోడీ ఇంటిపేరు ఉన్నవారంతా దొంగలే’’ అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పరువునష్టం కేసు దాఖలు చేశాడు. దీన్ని విచారించిన సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును ఇచ్చింది న్యాయమూర్తి హస్ముఖ్ వర్మనే.
తాజావార్తలు
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!