Supreme Court: దురదృష్టకరం.. ఎయిరిండియా ప్రమాద కథనాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
- అలాంటి వదంతులు రావడం దురదృష్టకరం
- ఎయిరిండియా ప్రమాద కథనాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక రిపోర్టుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం కూలిపోయింది. దాదాపు 271 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ప్రమాదంపై రెండు సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.
ఇది కూడా చదవండి: Shehbaz Sharif: నేటినుంచి 5 రోజులు అమెరికాలో పాక్ ప్రధాని పర్యటన.. ట్రంప్ను కలవనున్న షెహబాజ్ షరీఫ్
Also Read
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
ఒక దర్యాప్తు సంస్థ 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఇందులో టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత ఒకదాని తర్వాత ఒకటి.. రెండు ఇంజిన్ ఇంధన స్విచ్లు ఆపివేయబడ్డాయని తెలిపింది. అయితే కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లో ఒక పైలట్ మరొక పైలట్ను ‘‘నువ్వు ఎందుకు కట్ చేశావు?’’ అని అడుగుతున్నట్లు రికార్డైంది. మరొక పైలట్ ‘‘నేను చేయలేదు’’ అని ప్రతి స్పందించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ చివరి చూపు కోసం లక్షలాదిగా తరలివచ్చిన అస్సామీయులు.. 25 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్
ఈ విమాన ప్రమాదంపై స్వతంత్ర, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాఖ్యం(పీఐఎల్) దాఖలైంది. సోమవారం ఈ పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం విచారించింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా పైలట్లను నిందించడం బాధ్యతారాహిత్యం అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ‘‘ప్రాథమిక రిపోర్టును పట్టుకుని పైలట్లు తప్పు చేశారని నిందిస్తే.. ఆ కుటుంబాలు ఎంత బాధపడతాయి.. ఫైనల్ రిపోర్టు రావడానికి సమయం ఉంది కదా? తుది నివేదికలో ఏ తప్పు లేదని తేలితే ఏం జరుగుతుంది?’’. అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ‘‘దురదృష్టవశాత్తు కొన్నిసార్లు అలాంటి విషాదాలు జరిగినప్పుడు.. ప్రత్యర్థి విమాన కంపెనీలు ప్రయోజనం పొందుతాయి.’’ అని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పారదర్శకంగా, న్యాయంగా, వేగవంతమైన దర్యాప్తుపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు న్యాయస్థానం నోటీసు జారీ చేసింది. ఫైనల్ నివేదిక వచ్చేంత వరకు ఎవరిని నిందించడం గానీ.. పుకార్లు సృష్టించడం గానీ.. తప్పుగా ప్రొజెక్ట్ చేయడం గానీ చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది.
ప్రాథమిక రిపోర్టు రాగానే పైలట్ ఆత్మహత్య కారణంగానే అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం చేశాయి. దీంతో పైలట్ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. తుది నివేదిక రాకుండా ఎలా ప్రసారం చేస్తారంటూ నిలదీశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!