Supreme Court: ‘‘ మన రాజ్యాంగం గర్వకారణం’’.. నేపాల్, బంగ్లాలను ఉదహరించిన సుప్రీంకోర్టు..
- నేపాల్, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూడండి..
- మన రాజ్యాంగం మనకు గర్వకారణం..
- గవర్నర్ బిల్లుల రిజర్వ్పై సుప్రీం విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: సుప్రీంకోర్టు బిల్లులను గవర్నర్లు పెండింగ్లో పెట్టే అంశాన్ని విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రస్తావించింది. బుధవారం సుప్రీంకోర్టులో ఏప్రిల్ 12న ఇచ్చిన ఉత్తర్వులపై విచారణ జరిగింది. రాష్ట్రాలు రూపొందించి బిల్లును క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను ఇచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భారత రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజా ప్రాముఖ్యత లేదా ఏ విధంగానైనా ప్రజల్ని ప్రభావితం చేసే ఏదైనా చట్టంపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరే హక్కును నిర్వచించింది. ‘‘మన రాజ్యాంగం పట్ల మేమే గర్విస్తున్నాము’’ అని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు.
Read Also: Minister Seethakka : మేడారం జాతరపై రాజకీయాలు వద్దు.. గద్దెల మార్పుపై సీతక్క ఆగ్రహం.!
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
‘‘మన పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి, నేపాల్ పరిస్థితిని చూశాము’’ అని సీజేఐ అన్నారు. నేపాల్లో జెన్ జెడ్ యువత చేస్తు్న్న హింసాత్మక ఆందోళనల్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆ ఆందోళనల్లో 21 మంది మరణించారు. ‘‘బంగ్లాదేశ్ కూడా ఇలాంటివే జరిగాయి’’ అని జస్టిస్ విక్రమ్ నాథ్ జోక్యం చేసుకున్నారు. గతేడాది బంగ్లాదేశ్లో హింసాత్మక అల్లర్ల కారణంగా, షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
ఒక నెలకు పైగా బిల్లులను రిజర్వ్ చేసే విషయంలో గవర్నర్లను సమర్థిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్థించిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లుల్లో 90 శాతం ఒక నెలలోపే గవర్నర్లు క్లియర్ చేస్తారని తుషార్ మెహతా కోర్టుకు వెల్లడించారు. 1970 నుంచి 2025 వరకు 20 బిల్లులు మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయని కోర్టుకు తెలియజేశారు. అయితే, ఈ గణాంకాలను తాము పట్టించుకోమని న్యాయమూర్తులు అన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 7 బిల్లులను రిజర్వ్ చేయడంతో డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజావార్తలు
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!