Supreme Court: ‘‘ మన రాజ్యాంగం గర్వకారణం’’.. నేపాల్, బంగ్లాలను ఉదహరించిన సుప్రీంకోర్టు..
- నేపాల్, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూడండి..
- మన రాజ్యాంగం మనకు గర్వకారణం..
- గవర్నర్ బిల్లుల రిజర్వ్పై సుప్రీం విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: సుప్రీంకోర్టు బిల్లులను గవర్నర్లు పెండింగ్లో పెట్టే అంశాన్ని విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రస్తావించింది. బుధవారం సుప్రీంకోర్టులో ఏప్రిల్ 12న ఇచ్చిన ఉత్తర్వులపై విచారణ జరిగింది. రాష్ట్రాలు రూపొందించి బిల్లును క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను ఇచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భారత రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజా ప్రాముఖ్యత లేదా ఏ విధంగానైనా ప్రజల్ని ప్రభావితం చేసే ఏదైనా చట్టంపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరే హక్కును నిర్వచించింది. ‘‘మన రాజ్యాంగం పట్ల మేమే గర్విస్తున్నాము’’ అని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు.
Read Also: Minister Seethakka : మేడారం జాతరపై రాజకీయాలు వద్దు.. గద్దెల మార్పుపై సీతక్క ఆగ్రహం.!
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
‘‘మన పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి, నేపాల్ పరిస్థితిని చూశాము’’ అని సీజేఐ అన్నారు. నేపాల్లో జెన్ జెడ్ యువత చేస్తు్న్న హింసాత్మక ఆందోళనల్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆ ఆందోళనల్లో 21 మంది మరణించారు. ‘‘బంగ్లాదేశ్ కూడా ఇలాంటివే జరిగాయి’’ అని జస్టిస్ విక్రమ్ నాథ్ జోక్యం చేసుకున్నారు. గతేడాది బంగ్లాదేశ్లో హింసాత్మక అల్లర్ల కారణంగా, షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
ఒక నెలకు పైగా బిల్లులను రిజర్వ్ చేసే విషయంలో గవర్నర్లను సమర్థిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్థించిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లుల్లో 90 శాతం ఒక నెలలోపే గవర్నర్లు క్లియర్ చేస్తారని తుషార్ మెహతా కోర్టుకు వెల్లడించారు. 1970 నుంచి 2025 వరకు 20 బిల్లులు మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయని కోర్టుకు తెలియజేశారు. అయితే, ఈ గణాంకాలను తాము పట్టించుకోమని న్యాయమూర్తులు అన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 7 బిల్లులను రిజర్వ్ చేయడంతో డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజావార్తలు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..