Minister Seethakka : మేడారం జాతరపై రాజకీయాలు వద్దు.. గద్దెల మార్పుపై సీతక్క ఆగ్రహం.!
- మాజీ సీఎం కేసీఆర్పై మేడారం జాతర నిర్లక్ష్యం ఆరోపణలు
- గద్దెల మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీతక్క ఆగ్రహం
- భక్తుల సౌకర్యాలను ప్రతిష్టాత్మకంగా చూస్తున్న తెలంగాణ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka : మేడారం మహాజాతర నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఏబీఎన్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం జాతర అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆమె ఆరోపించారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతర నిర్వహణ, అభివృద్ధి పనులపై ముందుగానే ప్రణాళికలు రూపొందించి, వాటిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సీతక్క తెలిపారు.
మేడారం జాతరలో భక్తులు వేసే కానుకలను, బంగారం, డబ్బును ఉంచే గద్దెల వద్ద కొన్ని మార్పులు చేస్తున్నట్లు సీతక్క వెల్లడించారు. తాము, పూజారులు కలిసి చేసిన మార్పులు సీఎం రేవంత్ రెడ్డికి సంతృప్తి కలిగించలేదని, అందుకే ఆయనే స్వయంగా గద్దెల వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించనున్నారని ఆమె వివరించారు. ఈ నెల 13న లేదా 14న సీఎం మేడారం పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Varun Tej & Lavanya : మెగా కుటుంబంలో కొత్త అతిథి.. వరుణ్ తేజ్-లావణ్యకు బేబీ బాయ్
గద్దెల మార్పుపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజారులు, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండానే ఈ మార్పులు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. “మేడారం జాతర ఒక పవిత్రమైన ఉత్సవం. దానిని రాజకీయాలకు వేదికగా మార్చవద్దు. ఇది కేవలం భక్తితో చూడాల్సిన విషయం” అని ఆమె హితవు పలికారు. మహాజాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారికి సౌకర్యాలు మెరుగుపరచడానికే ఈ మార్పులు చేస్తున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన జాతరకు ఇప్పుడు సరైన ప్రాధాన్యత ఇస్తున్నామని, భక్తులు సంతోషంగా తమ మొక్కులు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, భక్తుల భద్రత, సౌకర్యాలపై పూర్తి శ్రద్ధ పెట్టిందని సీతక్క చెప్పారు. జాతర నిర్వహణలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూస్తున్నామని, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్గా భావిస్తోందని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత ఈ పనుల వేగం మరింత పుంజుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Mega Meet : ‘మన శంకర వరప్రసాద్’ ను కలిసిన ‘బెగ్గర్’.. ఫోటో వైరల్
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?