Kerala: కేరళలో మరో ఫుడ్ పాయిజనింగ్ కేసు.. విద్యార్థులు, పేరెంట్స్కు అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Students, Parents Fall Ill After Eating Food: కేరళలో వరసగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పతినంతిట్ట జిల్లాలో ఓ చర్చ్ లో బాప్టిజం వేడుకలకు హాజరైన గ్రామస్తులు అక్కడి ఫుడ్ తిని అస్వస్థతకు గురయ్యారు. ఆ తరువాత బిర్యానీ తిని ఓ యువతి మరణించింది. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో జరిగిన ఓ ఈవెంట్ లో విద్యార్థులు, తల్లిందండ్రులు ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కూడా పతినంతిట్ట జిల్లాలోనే చోటు చేసుకుంది. జిల్లాలోని కొడుమోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 6న ఓ పాఠశాల కార్యక్రమంలో ఆహారం తీసుకున్న తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులు అస్వస్థతకు గురయ్యారు. నలుగురు చిన్నారులతో సహా, 7-8 మంది ఫుడ్ పాయిజనింగ్ తో బాధపడుతున్నట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
Read Also: WTC Final: ఆస్ట్రేలియాకు ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు.. రెండో స్థానం ఎవరిది?
Also Read
- Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
- Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
- Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
- Abhishek Banerjee: మమత మేనల్లుడికి బిగుస్తున్న ఉచ్చు.. మరో కేసు నమోదు..
ఇదిలా ఉంటే ఫుడ్ పాయిజనింగ్ తో ఇటీవల కేరళలో ఇద్దరు మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. కాసర్ గోడ్ జిల్లా పెరంబాలకు చెందిన అంజు శ్రీపార్వతి అనే యువతి స్థానిక హోటల్ నుంచి బిర్యానీ తెప్పించుకుని తిన్న తర్వాత శనివారం మరణించింది. అయితే అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్ తో చనిపోలేదని ఆహార భద్రతా అధికారులు వెల్లడించారు. యువతి తిన్న ఆహారంలో ఎటువంటి కల్తీ కనుగొనబడలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు కొట్టాయంకు చెందిన రేష్మి అనే నర్సు ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయింది. జనవరి 1న పతినంతిట్ట జిల్లా జనవరి 1న కీజ్వాయిపూర్ సమీపంలోని చర్చిలో బాప్టిజం సందర్భంగా వడ్డించిన ఆహారాన్ని తిన్న సుమారు 100 మంది అనుమానాస్పద ఫుడ్ పాయిజన్తో బాధపడ్డారు.
తాజావార్తలు
-
Nara Lokesh : మహిళలకు రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు..
-
Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
-
Mercury transit 2026: మే 29న అరుదైన “సరస్వతి యోగం”.. ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
-
Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
ట్రెండింగ్
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!