Stone Pelting: చిచ్చుపెట్టిన చికెన్..! రెండు వర్గాల మధ్య దాడులు
Stone Pelting: చికెన్ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది.. పరస్పరం దాడులకు వరకు వెళ్లింది వ్యవహారం.. ఇంతకీ చికెన్ ఏంటి? రెండు వర్గాల మధ్య దాడులకు ఎందుకు దారితీసింది? అనే వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన చోటు చేసుకుంది… సోమవారం రాత్రి అలీగఢ్లోని సరాయ్ సుల్తానీలో ఉన్న ఓ మాంసం దుకాణానికి కొందరు యువకులు చికెన్ కొనుగోలు చేసేందుకు వెళ్లారు.. అయితే, ఆ సమయంలో చికెన్ విక్రయించే వ్యక్తి, ఆ యువకులకు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అది కాస్త గొడవకు దారితీసింది.. దీంతో, పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. సాస్నిగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరాయ్ సుల్తానీ చౌకీ సమీపంలోని జరిగిన రెండు వర్గాల యువకుల మధ్య ఘర్షణలో.. ఆకాష్, సిద్ధార్థ్, నరేష్ గౌతమ్ అనే ముగ్గురు యువకులు గాయపడ్డారు. కొన్ని కార్ల అద్దాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. గాయపడిన యువకులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Also: Passenger Train: విశాఖలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు..
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
మరోవైపు, రాళ్ల దాడి చాలాసేపు కొనసాగడంతో ఐజీ దీపక్కుమార్, డీఎం ఇంద్ర విక్రమ్ సింగ్, ఎస్ఎస్పీ కళానిధి నైతానీ, పీఏసీతోపాటు జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గాయపడిన యువకుల బంధువులు, వారి మద్దతుదారులు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నాకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ఇక, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చికెన్ షాపును మూసివేయాలని డిమాండ్ చేశారు.. అయితే, గతంలో చాలా సార్లు ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అకస్మాత్తుగా గుంపు మరోసారి రెచ్చిపోయి కౌంటర్ను ధ్వంసం చేశారని.. ఇతర వర్గాలకు చెందిన గుంపు సుల్తాన్ కీ సరాయ్ వీధి నుండి రాళ్లు రువ్వడం ప్రారంభించిందని చెబుతున్నారు.. అయితే, మరోసారి పోలీసుల ముందే ఘర్షణ చోటు చేసుకుంది.. మళ్లీ రాళ్ల దాడి జరిగింది. ఎలాగోలా ఇరువర్గాలను మళ్లీ శాంతింపజేశారు. ఐజీ దీపక్కుమార్ మైక్ని చేతిలోకి తీసుకుని వీధిలోని ప్రజలను ఇళ్లలోనే ఉండాలని, శాంతిభద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఎస్ఎస్పీ కళానిధి నైతానీ, ఐజీ దీపక్కుమార్లు ఫిర్యాదు మేరకు చర్యలకు ఉపక్రమించారు.
తాజావార్తలు
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!