భారత తొలి ‘స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్’ ఐఎన్ఎస్ విశాఖపట్నం నేడు ముంబయి విధుల్లో చేరింది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు నౌకాదళ ఉన్నాతాధికారులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ మాట్లా డారు. రాజ్నాథ్ సింగ్ అధికారులతో కలిసి ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలను పరిశీలించారు. దీని రాకతో హిందూ మహాసముద్రంలో నౌకదళంలో భారత్ బలం మరింతగా పెరిగిందన్నారు. భారత్పై ఆధిపత్యం చెలాయించాలనుకునే దేశాలకు తగిన గుణపాఠం చెబుతామని చైనాను పరోక్షంగా హెచ్చరించారు రాజ్నాథ్ సింగ్.
అంతర్జాతీయ సరిహద్దులను ఉల్లంఘిస్తూ సముద్రజలాల ఆక్రమణకు పాల్పడుతున్నాయని అలాంటి దేశాలకు భారత్ ఖచ్చితంగా బుద్ధి చెబుతుందన్నారు. ఇప్పటికైనా అంతర్జాతీయ సరిహద్దులను ఉల్లం ఘించొద్దని, ఉల్లంఘిస్తే భారత్ ధీటైన సమాధానం చెబుతుం దని రాజ్నాథ్ సింగ్ చైనాను ఉద్దేశించి అన్నారు. ప్రాజెక్టు 15బీ పేరుతో మొత్తం నాలుగు అత్యంత అధునాతన నౌకలను తయారు చేస్తు న్నారు. ముంబయి మజగాన్ డాక్లో ఈ నౌకను నిర్మించారు. నౌకలకు ప్రముఖ నగరాల పేర్లను పెట్టడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఈ నౌకకు ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’గా నామకరణం చేశారు.
ఇవే ప్రత్యేకతలు..
ఈ నౌక కదలికల్ని శత్రుదేశ రాడార్లు గుర్తించలేవు. ఇందుకోసం అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.రెండు మల్టీరోల్ హెలీకాప్టర్లు ఇందులో ఉంటాయి. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులతో సహా పలు రకాల క్షిపణులను ఈ నౌక నుంచి ప్రయోగించవచ్చు.జలాంతర్గాములను కూడా ఇది గుర్తించి దాడి చేయగలదు. తీర నౌకదళంలో గస్తీతో పాటు కఠినమైన పరిస్థితుల్లో యుధ్దనౌకగా కూడా దీనిని వినియోగించుకోవచ్చు.
Attended the commissioning ceremony of INS Visakhapatnam into Indian Navy today. This indigenously developed missile destroyer is packed with state-of-the-art weapons & modern technology. It is a symbol of India’s growing maritime prowess.@indiannavy https://t.co/kpQCUHiGy8 pic.twitter.com/7G35fFlzQ1
— Rajnath Singh (@rajnathsingh) November 21, 2021