Punjab: రూ.45లక్షలు అప్పు చేసి అమెరికా వెళ్లాడు.. గంటల వ్యవధిలోనే పట్టుబడ్డాడు
- రూ.45లక్షలు అప్పు చేసి అమెరికా వెళ్లాడు
- గంటల వ్యవధిలోనే పట్టుబడ్డాడు
- ఆదివారం అమృత్సర్లో దిగిన సౌరవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన భారతీయుల పరిస్థితి దారుణంగా తయారైంది. అమెరికా అధికారుల చేతుల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు.. లక్షలు అప్పు చేసి అమెరికా చేరుకుంటే.. తీరా అక్కడ దిగగానే అధికారుల చేతుల్లో చిక్కుకుని ముప్పు తిప్పలు పడుతున్నారు. తాజాగా పంజాబ్కు చెందిన సౌరవ్ తనకు ఎదురైన పరిస్థితిని వివరించి కన్నీటి పర్యంతం అయ్యారు. అమెరికా నుంచి అమృత్సర్కు వచ్చిన రెండో విమానంలో సౌరవ్ ఉన్నారు. ఓ ఏజెంట్ చేతిలో మోసపోయి.. తిరిగి భారత్కు చేరుకున్నాడు.
ఇది కూడా చదవండి: Tollywood: శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వానం అందుకున్న టాలీవుడ్ హీరోలు..
Also Read
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
- Bihar: ఇన్స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
- Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
సౌరవ్.. పంజాబ్ వాసి. కుమారుడి భవిష్యత్ కోసం తల్లిదండ్రులు భూమి అమ్మి రూ.45లక్షలు ఇచ్చి సౌరవ్ను అమెరికాకు పంపించారు. జనవరి 27న మెక్సికో ద్వారా అమెరికాలోకి ప్రవేశించాడు. అంతే 2-3 గంటల వ్యవధిలోనే సౌరవ్ను అమెరికా పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. దాదాపు 15-18 రోజులు శిబిరాల్లో ఉంచిన తర్వాత తిరిగి భారత్కు పంపేశారు. ఆదివారం అమృత్సర్లో దిగిన అమెరికా విమానంలో సౌరవ్ ఉన్నారు. ఈ సందర్భంగా తనకెదురైన ఇబ్బందులను మీడియాతో పంచుకున్నాడు.
‘‘నేను జనవరి 27న అమెరికాలోకి ప్రవేశించాను. అమెరికాలోకి ప్రవేశించిన 2-3 గంటల్లోనే పోలీసులు మమ్మల్ని పట్టుకున్నారు. మమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. 2-3 గంటల తర్వాత మమ్మల్ని ఒక శిబిరానికి తీసుకెళ్లారు. మేము 15-18 రోజులు శిబిరంలోనే ఉన్నాం. మా మాట వినడానికి ఎవరూ లేరు. రెండు రోజుల క్రితం మమ్మల్ని వేరే శిబిరానికి తరలిస్తున్నట్లు చెప్పారు. మేము విమానం ఎక్కినప్పుడు, మమ్మల్ని భారతదేశానికి తిరిగి పంపుతున్నట్లు చెప్పారు..’’ అని సౌరవ్ అన్నారు. ‘‘విమానంలో మా చేతులు, కాళ్ళు కట్టేశారు. మమ్మల్ని పట్టుకున్న క్షణంలోనే మా మొబైల్ ఫోన్లు జప్తు చేశారు.’’ అని సౌరవ్ చెప్పాడు. తన కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని వాపోయాడు. తన కుటుంబం రూ.45లక్షలు అప్పు చేసి పంపించినట్లు తెలిపాడు. ప్రభుత్వాలే తమను ఆదుకోవాలని డిమాండ్ చేశాడు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: పాకిస్తాన్లో భారత జెండా వివాదం.. కరాచీ స్టేడియం వీడియో వైరల్
అమెరికా ప్రయాణం కోసం సౌరవ్ డిసెంబర్ 17న భారత్ నుంచి బయల్దేరాడు. అక్కడ నుంచి మలేషియాకు.. అక్కడ 10 రోజులు ఉండి.. అనంతరం ఆమ్ట్స్ర్డామ్, పనామా, టపాచులా, చివరకు మెక్సికో నగరానికి విమానంలో వెళ్లి అమెరికా సరిహద్దును దాటినట్లు తెలిపాడు. అయితే అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ఏర్పాట్లు చేసిన ఏజెంట్ పేరును మాత్రం వెల్లడించడానికి నిరాకరించారు.
ఇది కూడా చదవండి: Producer SKN: తెలుగు హీరోయిన్లపై ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ కామెంట్స్ వైరల్..
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!