Karnataka: కర్ణాటకలో సీఎం పోస్టుపై రగడ.. సిద్ధరామయ్య వర్సెస్ డీకే.శివకుమార్ మద్దతుదారుల ఫైటింగ్
- కర్ణాటకలో సీఎం పోస్టుపై రగడ
- సిద్ధరామయ్య వర్సెస్ డీకే.శివకుమార్ మద్దతుదారుల ఫైటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి మార్పు అంశం కాకరేపుతోంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని డీకే.శివకుమార్ మద్దతుదారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని చెబుతున్నారు. దీంతో సిద్ధరామయ్య వర్సెస్ డీకే.శివకుమార్ అనే విధంగా పరిణామాలు మారిపోయాయి. తాజా పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తం అయింది. హైకమాండ్ దూతలను కర్ణాటకకు పంపించింది. ప్రస్తుత పరిణామాలను కాంగ్రెస్ దూతలు పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Thammudu : ‘తమ్ముడు’ రిలీజ్ ట్రైలర్.. నితిన్ ఈ సారైన హిట్ దక్కేనా..!
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
డీకే.శివకుమార్కు మద్దతుగా 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. తక్షణమే డీకే.శివకుమార్ను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సే్న్ డిమాండ్ చేశారు. మిగిలిన పదవీ కాలం అయినా డీకే.శివకుమార్కు అప్పగించకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని తేల్చి చెప్పారు. చాలా మంది డీకే.శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని ఎదురుచూస్తు్న్నారని.. ఆ పదవి పొందేందుకు అర్హుడు అని తెలిపారు. పార్టీ విజయం కోసం అవిశ్రాంతంగా పని చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాలంటే డీకే.శివకుమార్ వల్లే సాధ్యమని చెప్పుకొచ్చారు. మెజార్టీ ఎమ్మెల్యేలంతా డీకే.శివకుమార్ వెంటే ఉన్నారని తెలిపారు. ఇప్పుడు గనుక ముఖ్యమంత్రిని మార్చకపోతే.. 2028లో మాత్రం కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని జోష్యం చెప్పారు. ముఖ్యమంత్రి మార్పుపై హైకమాండ్ మాత్రమే నిర్ణయం తీసుకోగలదని మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ఇక్బాల్ స్పందిస్తూ.. కాంగ్రెస్లో క్రమశిక్షణ ఉంటుందని.. ఎల్లప్పుడూ హైకమాండ్ను గౌరవిస్తామని.. కానీ వాస్తవాలు చెప్పాలి కదా? అని బదులిచ్చారు.
ఇది కూడా చదవండి: Viral News : గేదెకు రూ.14 లక్షలు.. అరేయ్ ఏంట్రా ఇది..
ఇక కర్ణాటక ప్రభుత్వంలో చోటుచేసుకున్న హఠాత్తు పరిణామాలను పరిశీలించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరుకు వచ్చారు. అసంతృప్తి ఎమ్మెల్యేలతో కలిసి వివరాలు సేకరించనున్నారు. ముఖ్యమంత్రి మార్పుపై అభిప్రాయాలు సేకరించి.. అధిష్టానానికి నివేదిక అందజేయనున్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..