Sonia Gandhi: ‘‘పాపం రాష్ట్రపతి’’.. సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియా గాంధీ వ్యాఖ్యలు వివాదాస్పదం..
- పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగపై ప్రతిపక్షాల విమర్శలు..
- రాష్ట్రపతిని అవమానించారని బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. సోనియా గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ద్రౌపది ముర్ము సుదీర్ఘ ప్రసంగం తర్వాత అలసిపోయినట్లు కనిపించారని కాంగ్రెస్ అధినేత్రి చేసిన వ్యాఖ్యలు ‘‘అవమానకరమైనవి’’ అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపనలు చెప్పాలని డిమాండ్ చేసింది. బడ్జెట్ సమావేశాలకు ముందు శుక్రవారం ఉదయం పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు.
Read Also: U-19 World Cup 2025: ఇంగ్లాండ్పై గెలిచి ఫైనల్కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు..
Also Read
- Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
- Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
- West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
‘‘రాష్ట్రపతి ప్రసంగం చివరి సమయానికి అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయింది, పాపం’’ అని సోనియా గాంధీ మీడియాతో మాట్లాడటం వివాదాస్పదమైంది. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ‘‘బోరింగ్’’గా పిలిచారు. అయితే, ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. పార్టీ చీఫ్ జేపీ నడ్డా మాట్లాడుతూ.. రాష్ట్రపతి గురించి, అత్యున్నత రాజ్యాంగ పదవి గురించి ప్రతిపక్షాల వైఖరిని ఇది స్పష్టం చేస్తుందని అన్నారు. ‘‘ రాష్ట్రపతి ప్రభుత్వ విజయాలను చెబుతుంటే, ప్రతిపక్షాలు, దాని భాగస్వామ్య పక్షాలు వెనకబడిన తరగతుల, మహిళ సాధికారతను ఎగతాళి చేస్తు్న్నాయి’’ అని అన్నారు. కాంగ్రెస్ వ్యాఖ్యలు పేదల, గిరిజన వ్యతిరేకత స్వభావాన్ని చూపిస్తున్నాయి, ప్రతిపక్షం బేషరతుగా క్షమాపనలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పూర్ణియా ఎంపీ పప్పూ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రపతిని ప్రభుత్వానికి రబ్బర్ స్టాంప్ అని, ఆమె ప్రేమ లేఖని చదివారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగం ఫన్నీగా, నిరుత్సాహభరితంగా ఉందని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. అయితే, ప్రతిపక్షాల వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందించారు. భారతదేశంలో మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతిని అవమానించడం కాంగ్రెస్ అసలు స్వభావాన్ని తెలియజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబం వెలుపల వ్యక్తి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉండటాన్ని నకిలీ ఘాండీ కుటుంబం సహించడం లేదని ఆయన ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
-
India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
-
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
-
Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!