Sonia Gandhi: ‘‘పాపం రాష్ట్రపతి’’.. సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియా గాంధీ వ్యాఖ్యలు వివాదాస్పదం..
- పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగపై ప్రతిపక్షాల విమర్శలు..
- రాష్ట్రపతిని అవమానించారని బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. సోనియా గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ద్రౌపది ముర్ము సుదీర్ఘ ప్రసంగం తర్వాత అలసిపోయినట్లు కనిపించారని కాంగ్రెస్ అధినేత్రి చేసిన వ్యాఖ్యలు ‘‘అవమానకరమైనవి’’ అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపనలు చెప్పాలని డిమాండ్ చేసింది. బడ్జెట్ సమావేశాలకు ముందు శుక్రవారం ఉదయం పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు.
Read Also: U-19 World Cup 2025: ఇంగ్లాండ్పై గెలిచి ఫైనల్కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు..
Also Read
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
- CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
‘‘రాష్ట్రపతి ప్రసంగం చివరి సమయానికి అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయింది, పాపం’’ అని సోనియా గాంధీ మీడియాతో మాట్లాడటం వివాదాస్పదమైంది. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ‘‘బోరింగ్’’గా పిలిచారు. అయితే, ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. పార్టీ చీఫ్ జేపీ నడ్డా మాట్లాడుతూ.. రాష్ట్రపతి గురించి, అత్యున్నత రాజ్యాంగ పదవి గురించి ప్రతిపక్షాల వైఖరిని ఇది స్పష్టం చేస్తుందని అన్నారు. ‘‘ రాష్ట్రపతి ప్రభుత్వ విజయాలను చెబుతుంటే, ప్రతిపక్షాలు, దాని భాగస్వామ్య పక్షాలు వెనకబడిన తరగతుల, మహిళ సాధికారతను ఎగతాళి చేస్తు్న్నాయి’’ అని అన్నారు. కాంగ్రెస్ వ్యాఖ్యలు పేదల, గిరిజన వ్యతిరేకత స్వభావాన్ని చూపిస్తున్నాయి, ప్రతిపక్షం బేషరతుగా క్షమాపనలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పూర్ణియా ఎంపీ పప్పూ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రపతిని ప్రభుత్వానికి రబ్బర్ స్టాంప్ అని, ఆమె ప్రేమ లేఖని చదివారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగం ఫన్నీగా, నిరుత్సాహభరితంగా ఉందని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. అయితే, ప్రతిపక్షాల వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందించారు. భారతదేశంలో మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతిని అవమానించడం కాంగ్రెస్ అసలు స్వభావాన్ని తెలియజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబం వెలుపల వ్యక్తి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉండటాన్ని నకిలీ ఘాండీ కుటుంబం సహించడం లేదని ఆయన ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
-
AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
-
Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!