Sonia Gandhi: ‘‘పాపం రాష్ట్రపతి’’.. సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియా గాంధీ వ్యాఖ్యలు వివాదాస్పదం..
- పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగపై ప్రతిపక్షాల విమర్శలు..
- రాష్ట్రపతిని అవమానించారని బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. సోనియా గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ద్రౌపది ముర్ము సుదీర్ఘ ప్రసంగం తర్వాత అలసిపోయినట్లు కనిపించారని కాంగ్రెస్ అధినేత్రి చేసిన వ్యాఖ్యలు ‘‘అవమానకరమైనవి’’ అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపనలు చెప్పాలని డిమాండ్ చేసింది. బడ్జెట్ సమావేశాలకు ముందు శుక్రవారం ఉదయం పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు.
Read Also: U-19 World Cup 2025: ఇంగ్లాండ్పై గెలిచి ఫైనల్కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
‘‘రాష్ట్రపతి ప్రసంగం చివరి సమయానికి అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయింది, పాపం’’ అని సోనియా గాంధీ మీడియాతో మాట్లాడటం వివాదాస్పదమైంది. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ‘‘బోరింగ్’’గా పిలిచారు. అయితే, ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. పార్టీ చీఫ్ జేపీ నడ్డా మాట్లాడుతూ.. రాష్ట్రపతి గురించి, అత్యున్నత రాజ్యాంగ పదవి గురించి ప్రతిపక్షాల వైఖరిని ఇది స్పష్టం చేస్తుందని అన్నారు. ‘‘ రాష్ట్రపతి ప్రభుత్వ విజయాలను చెబుతుంటే, ప్రతిపక్షాలు, దాని భాగస్వామ్య పక్షాలు వెనకబడిన తరగతుల, మహిళ సాధికారతను ఎగతాళి చేస్తు్న్నాయి’’ అని అన్నారు. కాంగ్రెస్ వ్యాఖ్యలు పేదల, గిరిజన వ్యతిరేకత స్వభావాన్ని చూపిస్తున్నాయి, ప్రతిపక్షం బేషరతుగా క్షమాపనలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పూర్ణియా ఎంపీ పప్పూ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రపతిని ప్రభుత్వానికి రబ్బర్ స్టాంప్ అని, ఆమె ప్రేమ లేఖని చదివారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగం ఫన్నీగా, నిరుత్సాహభరితంగా ఉందని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. అయితే, ప్రతిపక్షాల వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందించారు. భారతదేశంలో మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతిని అవమానించడం కాంగ్రెస్ అసలు స్వభావాన్ని తెలియజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబం వెలుపల వ్యక్తి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉండటాన్ని నకిలీ ఘాండీ కుటుంబం సహించడం లేదని ఆయన ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!