Sonia Gandhi: ‘‘పాపం రాష్ట్రపతి’’.. సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియా గాంధీ వ్యాఖ్యలు వివాదాస్పదం..
- పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగపై ప్రతిపక్షాల విమర్శలు..
- రాష్ట్రపతిని అవమానించారని బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. సోనియా గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ద్రౌపది ముర్ము సుదీర్ఘ ప్రసంగం తర్వాత అలసిపోయినట్లు కనిపించారని కాంగ్రెస్ అధినేత్రి చేసిన వ్యాఖ్యలు ‘‘అవమానకరమైనవి’’ అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపనలు చెప్పాలని డిమాండ్ చేసింది. బడ్జెట్ సమావేశాలకు ముందు శుక్రవారం ఉదయం పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు.
Read Also: U-19 World Cup 2025: ఇంగ్లాండ్పై గెలిచి ఫైనల్కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
‘‘రాష్ట్రపతి ప్రసంగం చివరి సమయానికి అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయింది, పాపం’’ అని సోనియా గాంధీ మీడియాతో మాట్లాడటం వివాదాస్పదమైంది. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ‘‘బోరింగ్’’గా పిలిచారు. అయితే, ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. పార్టీ చీఫ్ జేపీ నడ్డా మాట్లాడుతూ.. రాష్ట్రపతి గురించి, అత్యున్నత రాజ్యాంగ పదవి గురించి ప్రతిపక్షాల వైఖరిని ఇది స్పష్టం చేస్తుందని అన్నారు. ‘‘ రాష్ట్రపతి ప్రభుత్వ విజయాలను చెబుతుంటే, ప్రతిపక్షాలు, దాని భాగస్వామ్య పక్షాలు వెనకబడిన తరగతుల, మహిళ సాధికారతను ఎగతాళి చేస్తు్న్నాయి’’ అని అన్నారు. కాంగ్రెస్ వ్యాఖ్యలు పేదల, గిరిజన వ్యతిరేకత స్వభావాన్ని చూపిస్తున్నాయి, ప్రతిపక్షం బేషరతుగా క్షమాపనలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పూర్ణియా ఎంపీ పప్పూ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రపతిని ప్రభుత్వానికి రబ్బర్ స్టాంప్ అని, ఆమె ప్రేమ లేఖని చదివారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగం ఫన్నీగా, నిరుత్సాహభరితంగా ఉందని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. అయితే, ప్రతిపక్షాల వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందించారు. భారతదేశంలో మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతిని అవమానించడం కాంగ్రెస్ అసలు స్వభావాన్ని తెలియజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబం వెలుపల వ్యక్తి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉండటాన్ని నకిలీ ఘాండీ కుటుంబం సహించడం లేదని ఆయన ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!