‘‘సుబ్బి పెళ్లి.. వెంకి చావు’’కు వచ్చినట్లుంది మిత్రదేశాల మధ్య సంబంధం. ఇరాన్పై దాడికి అగ్ర రాజ్యం కసరత్తు చేస్తుండగా మిత్రదేశాలైన అమెరికా-బ్రిటన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ భీకర దాడులు చేసింది. 24 గంటల వ్యవధిలోనే మరోసారి శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.