Sonia Gandhi: జార్జ్ సోరోస్ ఫండింగ్ చేసిన సంస్థతో సోనియాగాంధీకి సంబంధం..
- సోనియా గాంధీకి జార్జ్ సోరోస్ సంస్థతో సంబంధాలు..
- బీజేపీ సంచలన ఆరోపణలు..
- భారత్పై కుట్రల వెనక యూఎస్ డీప్స్టేట్..
- విమర్శల్లో పదును పెంచిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: బీజేపీ అమెరికన్ డీప్ స్టేట్, జార్జ్ సోరోస్పై విరుచుకుపడుతోంది. గత కొన్నాళ్లుగా బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు అమెరికాలోని డీప్స్టేట్, దాని వెనక జార్జ్ సోరోస్ వంటి వ్యక్తులు కుట్రలు చేస్తు్న్నారని, ఈ కుట్రల వెనక అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. ఈ వ్యాఖ్యలను అమెరికన్ రాయబార కార్యాలయం ఖండించింది. నిరాధారమైన ఆరోపణలు, దురుద్దేశపూరితమైన నివేదికలతో భారత దేశ వృద్ధిని దెబ్బతీసేందుకు అమెరికా డీప్ స్టేట్ పనిచేస్తోందని, ఇది కొంతమంది జర్నలిస్టులతో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కుమ్మక్కయ్యాయని సంబిత్ పాత్ర ఆరోపించడం సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి బీజేపీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాశ్మీర్ని స్వతంత్ర దేశంగా భావించేందుకు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించిన సంస్థతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆదివారం ఆరోపించింది. ఈ అసోసియేషన్ భారత్ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ సంస్థల ప్రభావాన్ని చూపుతుందని ఎక్స్ వేదికగా బీజేపీ ట్వీట్ చేసింది.
Also Read
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
సోనియా గాంధీ కో ప్రెసిడెంట్గా ఉన్న ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ (ఎఫ్డిఎల్-ఎపి) ఫౌండేషన్కు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం చేసిన సంస్థతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ పేర్కొంది. ముఖ్యంగా ఎఫ్డిఎల్-ఎపి ఫౌండేషన్ కాశ్మీర్ని ప్రత్యేక దేశంగా భావిస్తున్నట్లు తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు బీజేపీ తెలిపింది. సోనియాగాంధీ కాశ్మీర్ స్వతంత్ర దేశంగా సమర్థించిన ఒక సంస్థతో అనుబంధం, భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ సంస్థల ప్రభావాన్ని, దాని రాజకీయాన్ని వ్యక్తపరుస్తుందని చెప్పింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు సోనియా గాంధీ అధ్యక్షత వహించడం వల్ల జార్జ్ సోరోస్ ఫౌండేషన్తో భాగస్వామ్యానికి దారితీసిందని బీజేపీ పేర్కొంది.
‘‘అదానీపై రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ జార్జ్ సోరోస్ నిధులతో నడిచే OCCRP ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. దీనిని రాహుల్ గాంధీ అదానీని విమర్శించేందుకు ఓ సోర్స్గా వాడుకుంటున్నాడు. ఇది వీరి మధ్య బలమైన, ప్రమాదకరమైన సంబంధాన్ని చూపిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి వారి ప్రయత్నాలను హైలెట్ చేస్తుంది’’ అని బీజేపీ చెప్పింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ జార్జ్ సోరోస్ తనకు పాతమిత్రుడని బహిరంగంగా అంగీకరించిన విషయాన్ని బీజేపీ గుర్తు చేసింది.
This thread underlines a connection between the Congress party and George Soros, implying their shared goal of diminishing India's growth.
Sonia Gandhi, as the Co-President of the FDL-AP Foundation, is linked to an organisation financed by the George Soros Foundation.
Notably,… pic.twitter.com/q9mrJ1lY3h
— BJP (@BJP4India) December 8, 2024
తాజావార్తలు
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
-
US Cuba Drone Tension: ఇరాన్కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
-
Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!