ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీ జరిగింది. వర్చువల్ విధానం ద్వారా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలపై సోనియా గాంధీ ఫైర్ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అధినేత్రి సోనియా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల పనితీరుపై ఆమె మండిపడ్డారు. అదే విధంగా ఈ సమావేశంలో దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ, వ్యాక్సిన్, లాక్ డౌన్ తదితర అంశాలపై కూడా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో కొత్త అధ్యక్షుడి గురించి కూడా చర్చించబోతున్నారని సమాచారం.