Modi at Somnath : సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్.. చారిత్రక వేడుకలు.. ఆకాశాన్ని అలరించిన 3,000 డ్రోన్లు..!
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్.. చారిత్రక వేడుకలు
- సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- ఆకాశాన్ని అలరించిన 3,000 డ్రోన్లు
- 'అఖండ భారత్' సందేశం ఆవిష్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచ యవనికపై సగర్వంగా నిలబెడుతున్న యుగపురుషుడు, ప్రధాని నరేంద్ర మోడీ. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడమే కాకుండా, ఆధునిక సాంకేతికతను జోడించి మన ప్రాచీన పుణ్యక్షేత్రాలకు నూతన శోభను చేకూరుస్తున్న అపర భగీరథుడు ఆయన. అచంచలమైన దైవభక్తితో, దేశభక్తిని మేళవించి ప్రతి భారతీయుడిలో స్వాభిమానాన్ని నింపుతున్న మోడీ పర్యటనతో సోమనాథ్ తీరం నేడు భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
భారతదేశ ఆధ్యాత్మిక , నాగరికతకు చిహ్నమైన గుజరాత్లోని సోమనాథ్ పుణ్యక్షేత్రం ఒక అపూర్వమైన ఘట్టానికి వేదికైంది. ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ (Somnath Swabhiman Parv) వేడుకల్లో భాగంగా నిర్వహించిన మెగా డ్రోన్ షోను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తిలకించారు. 1026వ సంవత్సరంలో సోమనాథ్ ఆలయంపై జరిగిన మొట్టమొదటి దాడికి వెయ్యి ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఆ ఆలయం స్థితిస్థాపకతను , భారతీయ ధైర్యసాహసాలను చాటిచెప్పేందుకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శుక్రవారం సాయంత్రం ఆలయానికి చేరుకోగా, స్థానిక ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

Potatoes: బంగాళాదుంపతో ప్రయోజనాలు..! నాలుగు ప్రధాన అపోహలు..
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సోమనాథుడిని దర్శించుకుని, లోకకల్యాణం కాంక్షిస్తూ ఆలయ గర్భాలయంలో ప్రత్యేక పూజలు, శాస్త్రోక్తంగా జలాభిషేకం నిర్వహించారు. పరమశివుడి పాదపద్మాల చెంత అచంచలమైన భక్తితో కొద్దిసేపు ధ్యానంలో మునిగిపోయిన ఆయన, భారతీయ సంస్కృతికి మూలస్తంభమైన ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధికి తన అంకితభావాన్ని మరోసారి చాటుకున్నారు.

ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన డ్రోన్ షో ఆద్యంతం అబ్బురపరిచింది. సుమారు 3,000 డ్రోన్లను ఉపయోగించి ఆకాశంలో అద్భుతమైన ఆకృతులను ఆవిష్కరించారు, ఇది దేశంలోని ఒక ఆలయ ప్రాంగణం సమీపంలో జరిగిన అతిపెద్ద ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. సుమారు 15 నిమిషాల పాటు సాగిన ఈ ప్రదర్శనలో 370 మీటర్ల వెడల్పు కలిగిన సోమనాథ్ ఆలయ 3D ప్రతిరూపాన్ని గాలిలో నిర్మించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. అలాగే, ఆకాశంలో సుమారు 280 మీటర్ల ఎత్తులో పరమశివుడి ఆకారాన్ని, 330 మీటర్ల పొడవుతో భారీ శివలింగాన్ని డ్రోన్ల సాయంతో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆధ్యాత్మికతతో పాటు జాతీయ సమగ్రతను చాటిచెబుతూ ‘అఖండ సోమనాథ్, అఖండ భారత్’ అనే సందేశాన్ని ఆకాశంలో ఆవిష్కరించారు.

ఐఐటీ ఢిల్లీకి చెందిన ‘బోట్ల్యాబ్’ (BotLab) సంస్థ ఈ ప్రదర్శనను అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించింది. శివ తాండవం, డమరుకం, ఓం , త్రిశూలం వంటి శైవ చిహ్నాలను డ్రోన్లు ఆకాశంలో ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పందిస్తూ.. సోమనాథ్ మన నాగరిక ధైర్యానికి ప్రతీక అని, ఈ వెయ్యేళ్ల చారిత్రక సందర్భంలో దేశమంతా ఏకమై పండుగలా జరుపుకోవడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ఆలయ మార్గమంతా పండుగ శోభతో నిండిపోయిందని, పరాక్రమవంతుడైన వీర్ హమీర్జీ గోహిల్ త్యాగాలను స్మరించుకుంటూ ఈ వేడుకలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు.

కేవలం రూ.21,599కే 55 అంగుళాల BESTON QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ..!
తాజావార్తలు
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
-
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
-
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!