Bangladesh: బంగ్లాదేశ్లో ఏదో జరుగుతోంది.. హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధం..?
- బంగ్లాదేశ్లో ఏదో జరుగుతోంది..
- షేక్ హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధం..?
- ట్రంప్ గెలుపుతో మారుతున్న సమీకరణాలు..
- యూనస్పై ఐసీసీలో ఫిర్యాదు..
- ట్రంప్ వ్యతిరేకిగా బంగ్లా ప్రభుత్వాధినేత యూనస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో ఏదో జరుగుతోంది.. రానున్న కొన్ని రోజుల్లో బంగ్లా రాజకీయాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత షేక్ హసీనా తనను తాను ప్రధానిగా సంభోదిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు ట్రంప్ గెలవడం ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్కి పెద్ద తన నొప్పిగా మారింది. మొదటి నుంచి ట్రంప్ వ్యతిరేకిగా యూనస్కి పేరుంది. ట్రంప్ గెలిచిన తర్వాత అతను కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. మరోవైపు షేక్ హసీనాకు, ట్రంప్తో మంచి సంబంధాలు ఉన్నాయి.
నిజానికి బంగ్లాదేశ్లో షేక్ హసీనాని గద్దె దించడానికి జో బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం, అమెరికా డీప్ స్టేట్ పనిచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ డీప్ స్టేట్ ట్రంప్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది. మహ్మద్ యూనస్ బైడెన్, కమలా హారిస్కి అత్యంత సన్నిహితుడిగా చెప్పబడుతున్నాడు. ఇతడిని బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతగా చేసిందే జోబైడెన్ అనే వాదన ఉంది. ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే రానున్న కాలంలో బంగ్లాదేశ్ రాజకీయాలు చాలా మార్పులకు గురవుతాయనేది స్పష్టంగా తెలుస్తోంది.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: Delhi: హిందూ ఆలయాలపై దాడులు చేస్తే ఊరుకోం.. సిక్కుల భారీ నిరసన(వీడియో)
షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్కి వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్లు వినికిడి. దీనికి తోడు మహ్మద్ యూనస్పై అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం(ఐసీసీ)లో ఫిర్యాదు నమోదైంది. ఈ వారం బంగ్లా ఆర్మీ చీఫ్ భారత్కి రావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అక్కడి రాడికల్ ఇస్లామిక్ గ్రూపులతో అవామీ లీగ్ కార్యకర్తలు, మద్దతుదారులు పోరాడుతున్నారు. ఈ పరిణామాలు చూస్తే త్వరలోనే బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం పడిపోతుందనే భావన కలుగుతోంది.
యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులు, క్రిస్టియన్స్, బౌద్ధులపై దాడులు జరిగాయి. ఈ దాడులను ఇటీవల ట్రంప్ తీవ్రంగా ఖండించారు. యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి తాత్కిలిక ప్రభుత్వంలోని ముఖ్యులు భారత్, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా, ఓ విధంగా చెప్పాలంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాలన్నింటిని భారత్ గమనిస్తోంది. బంగ్లాలోని తీవ్రవాద గ్రూపులు షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్ని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇక ట్రంప్ రావడంతో భారత్ ఇక బంగ్లాలో తన గేమ్ ప్రారంభిస్తుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?