Bangladesh: బంగ్లాదేశ్లో ఏదో జరుగుతోంది.. హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధం..?
- బంగ్లాదేశ్లో ఏదో జరుగుతోంది..
- షేక్ హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధం..?
- ట్రంప్ గెలుపుతో మారుతున్న సమీకరణాలు..
- యూనస్పై ఐసీసీలో ఫిర్యాదు..
- ట్రంప్ వ్యతిరేకిగా బంగ్లా ప్రభుత్వాధినేత యూనస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో ఏదో జరుగుతోంది.. రానున్న కొన్ని రోజుల్లో బంగ్లా రాజకీయాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత షేక్ హసీనా తనను తాను ప్రధానిగా సంభోదిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు ట్రంప్ గెలవడం ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్కి పెద్ద తన నొప్పిగా మారింది. మొదటి నుంచి ట్రంప్ వ్యతిరేకిగా యూనస్కి పేరుంది. ట్రంప్ గెలిచిన తర్వాత అతను కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. మరోవైపు షేక్ హసీనాకు, ట్రంప్తో మంచి సంబంధాలు ఉన్నాయి.
నిజానికి బంగ్లాదేశ్లో షేక్ హసీనాని గద్దె దించడానికి జో బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం, అమెరికా డీప్ స్టేట్ పనిచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ డీప్ స్టేట్ ట్రంప్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది. మహ్మద్ యూనస్ బైడెన్, కమలా హారిస్కి అత్యంత సన్నిహితుడిగా చెప్పబడుతున్నాడు. ఇతడిని బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతగా చేసిందే జోబైడెన్ అనే వాదన ఉంది. ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే రానున్న కాలంలో బంగ్లాదేశ్ రాజకీయాలు చాలా మార్పులకు గురవుతాయనేది స్పష్టంగా తెలుస్తోంది.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
Read Also: Delhi: హిందూ ఆలయాలపై దాడులు చేస్తే ఊరుకోం.. సిక్కుల భారీ నిరసన(వీడియో)
షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్కి వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్లు వినికిడి. దీనికి తోడు మహ్మద్ యూనస్పై అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం(ఐసీసీ)లో ఫిర్యాదు నమోదైంది. ఈ వారం బంగ్లా ఆర్మీ చీఫ్ భారత్కి రావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అక్కడి రాడికల్ ఇస్లామిక్ గ్రూపులతో అవామీ లీగ్ కార్యకర్తలు, మద్దతుదారులు పోరాడుతున్నారు. ఈ పరిణామాలు చూస్తే త్వరలోనే బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం పడిపోతుందనే భావన కలుగుతోంది.
యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులు, క్రిస్టియన్స్, బౌద్ధులపై దాడులు జరిగాయి. ఈ దాడులను ఇటీవల ట్రంప్ తీవ్రంగా ఖండించారు. యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి తాత్కిలిక ప్రభుత్వంలోని ముఖ్యులు భారత్, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా, ఓ విధంగా చెప్పాలంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాలన్నింటిని భారత్ గమనిస్తోంది. బంగ్లాలోని తీవ్రవాద గ్రూపులు షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్ని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇక ట్రంప్ రావడంతో భారత్ ఇక బంగ్లాలో తన గేమ్ ప్రారంభిస్తుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!