Operation Sindoor: పాక్ డ్రోన్లను అడ్డుకునే సమయంలో, శకలాలు ఢీకొని సైనికుడి మరణం..
- పాక్ డ్రోన్ శకలాలు ఢీకొని సైనికుడి వీర మరణం..
- జమ్మూ ఉధంపూర్లో ఘటన..
- డ్రోన్ని అడ్డగించి, కూల్చే సమయంలో ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పాకిస్తాన్ డ్రోన్ దాడి కారణంగా ఒక సైనికుడు అమరుడయ్యారు. డ్రోన్ని అడ్డగించిన సమయంలో దాని శకలాల్లో ఒకటి బలంగా తాకడంతో జవాన్ మరణించినట్లు అధికారులు తెలిపారు. శనివారం, జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలోని వైమానిక స్థావరంలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డ్రోన్ని విజయవంతంగా అడ్డగించింది. అయితే, డ్రోన్ శిథిలాలు సురేంద్ర సింగ్ మోగ అనే సైనికుడిని బలంగా ఢీకొట్టాయి. దీంతో తీవ్రగాయాలైన అతను మరణించాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సురేంద్ర సింగ్ విధుల్లో ఉన్నారు.
Read Also: IND vs ENG: రోహిత్ శర్మ స్థానంలో భారీ హిట్టర్.. ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తున్నాడు!
Also Read
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ సైనికుడికి ఘన నివాళి అర్పించారు. అతడి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ‘‘సురేంద్ర సింగ్ మోగా రాజస్థాన్ బిడ్డ, ఝుంఝును నివాసి. భారత సైన్యంలోని సైనికుడు సురేంద్ర సింగ్ మోగా, దేశ భద్రతా కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉదంపూర్ వైమానిక స్థావరంలో అమరుడయ్యరనే వార్త చాలా విచారకరం’’ అని ఆయన ఎక్స్లో రాశారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత నుంచి పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద దాడులకు పాల్పడుతోంది. అయితే, భారత గగనతర రక్షణ వ్యవస్థ వీటిని సమర్థంతంగా అడ్డుకుని గాల్లోనే కూల్చేశాయి. ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, రెండు దేశాలు కూడా శనివారం కాల్పులు స్టాప్ చేయడానికి అంగీకరించాయి.
తాజావార్తలు
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!