Pulwama Attack: పుల్వామా ఉగ్రదాడికి ఆరేళ్లు.. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్తో పాకిస్తాన్కి బదులు..
- పుల్వామా ఉగ్రదాడికి ఆరేళ్లు..
- బాలా కోట్ దాడులతో భారత్ ప్రతీకారం..
- 40 మంది జవాన్లను బలిగొన్న ఉగ్ర ఘటన..
- దాడి వెనక పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pulwama Attack: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ‘‘పుల్వామ ఉగ్రదాడి’’కి ఆరేళ్లు గడిచాయి. 2019, ఫిబ్రవరి 14న పేలుడు పదార్థాలతో నిండిన కారు, సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుని ఢీకొట్టింది. ఈ దాడిలో 40 మంది సైనికులు అమరులయ్యారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడింది.
జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారి గుండా, దాదాపుగా 2500 మంది సైనికులతో 78 బస్సులు వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. వేగంగా వచ్చిన కారు కాన్వాయ్కి సమీపంలోకి వచ్చి, బస్సును ఢీకొట్టింది. అవంతిపోరాలోని గోగిపారా వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు తునాతునకలైంది. జవాన్ల శరీరాలు ఛిద్రమయ్యాయి. ఈ దాడి తర్వాత అక్కడే దాక్కున్న ఉగ్రవాదులు సైనికులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే దాడి నుంచి తేరుకున్న జవాన్లు ప్రతిదాడి చేశారు.
Also Read
- Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
- NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Modi-Trump Meet: ఫ్రాన్స్లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్హౌజ్..
బాలాకోట్ వైమానిక దాడితో పాక్కి బదులు:
ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉగ్రవాదం, పాకిస్తాన్ పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అయితే, దాడి జరిగిన 12 రోజులు తర్వాత, అంటే ఫిబ్రవరి 25, 2019లో భారత వైమానిక దళం పాకిస్తాన్ బాలాకోట్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 300 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
పుల్వామా వెనక ఉన్నది ఎవరు:
పుల్వామా దాడిలో పేలుడు పదార్థాలు నిండిన కారును నడిపిన వ్యక్తిని 22 ఏళ్ల ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్గా గుర్తించారు. ఘటనకు రెండేళ్ల క్రితమే అతను జైషే మహ్మద్లో చేరాడు. చివరిసారిగా 2018లో కాశ్మీర్లోని తన ఇంటికి వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత అతను ఇంటిని వదిలి వెళ్లి తిరిగి రాలేదు.
ఆత్మాహుతి బంబార్ ఆదిల్ అహ్మద్ దార్ని పోలీసులు వివిధ కేసుల్లో 6 సార్లు అదుపులోకి తీసుకున్నారు. ప్రతీసారి హెచ్చరించి వదిలేశారు. పుల్వామా దాడికి ప్రధాన సూత్రధారి జైష్ ఉగ్రవాది కమ్రాన్. అతను ఫిబ్రవరి 18, 2019న భద్రతా దళాలు చేసిన ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. పుల్వామా ఉగ్రదాదికి 10 కి.మీ దూరంలో 12 గంటల పాటు జరిగిన ఎన్కౌంటర్లో కమ్రాన్ హతమయ్యాడు. అతను జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్ కు అత్యంత సన్నిహితుడు.
తాజావార్తలు
-
Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
-
Power Star : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. స్టార్ దర్శకుడితో సినిమా డౌటే
-
Bollywood Gossip : నేను ‘గే’ కాదు… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
-
MRM Portal: MRM పోర్టల్ అంటే ఏమిటి? సైబర్ మోసంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఎలా పొందాలి?
-
Trisha : భారీ రెమ్యునరేషన్ అడిగిన త్రిష.. బిత్తరపోయిన నిర్మాత
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!