Karnataka: సీఎం సిద్ధరామయ్య ఇంటికి మంత్రులు, ఎమ్మెల్యేలు.. రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్..
- ముడా భూ కుంభకోణంలో సిద్ధరామయ్యకు హైకోర్టు షాక్..
- రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ..
- సిద్ధరామయ్య ఇంటికి మంత్రులు.. ఎమ్మెల్యేలు..
- సుప్రీంని ఆశ్రయించే యోచనలో సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: ముడా భూ కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముడా స్కామ్లో సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించిన సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. ‘‘ ఈ కేసులో గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించారని, వాస్తవాలు వెలుగులోకి తేవాలి’’ అని హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ నాగ ప్రసన్న అన్నారు. సిద్ధరామయ్య వేసిన పిటిషన్ని కొట్టేశారు.
Read Also: CM Chandrababu: నామినేటెడ్ పోస్టుల భర్తీ.. సామాన్య కార్యకర్తలకు టీడీపీ పెద్దపీట..
Also Read
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
- Free LPG Cylinders Scheme: గుడ్న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
ఇదిలా ఉంటే, హైకోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయ చర్చ మొదలైంది. సిద్ధరామయ్య ఇంటికి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు. డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా సీఎం ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ఆయన ఇంటి ముందు భారీ పోలీస్ భద్రతని ఏర్పాటు చేశారు. సీఎంకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో తదుపరి చర్యల గురించి కాంగ్రెస్ నేతలంతా చర్చిస్తున్నారు. సుప్రీంకోర్టుని సిద్ధరామయ్య ఆశ్రయిస్తారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, హైకోర్టు తీర్పు సీఎంకి వ్యతిరేకంగా రావడంతో బీజేపీ తన స్వరాన్ని పెంచింది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ మంగళవారం డిమాండ్ చేసింది. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం తమ ముఖ్యమంత్రిపై బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. సీఎం రాజీనామా చేసే ప్రశ్నే లేదని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎంకి చెంపపెట్టు అని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. గవర్నర్ చర్యల్లో ఎలాంటి తప్పు లేదని బీజేపీ కర్ణాటక చీఫ్ బీవై విజయేంద్ర అన్నారు. ముడా స్కామ్లో సిద్ధరామయ్య కుటుంబం పేరు వస్తున్నందున గౌరవంగా ఆయన రాజీనామా చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!