Shiv Sena-UBT: ఆప్-కాంగ్రెస్ ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి పోరాడాయి..
- ఆప్-కాంగ్రెస్ ఒకరినొకరు దెబ్బతీసుకున్నారు..
- శివసేన ఉద్ధవ్ వర్గం విమర్శలు..
- సొంత పత్రిక సామ్నాలో ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiv Sena-UBT: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయంతో పాటు కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంపై ఇండియా కూటమిలోని ఇతర నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో, ఆప్ 22 స్థానాల్లో గెలుపొందింది. వరసగా మూడోసారి కూడా కాంగ్రెస్ సున్నా స్థానాలకు పరిమితమైంది. 67 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అత్యంత అవమానకర రీతిలో కాంగ్రెస్ ఓడిపోయింది.
Read Also: PM Modi: మిత్రుడు ‘‘ట్రంప్’’ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. మోడీ సందేశం..
Also Read
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వాములైన కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేయకపోవడంతోనే బీజేపీ గెలిచిందని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరి మధ్య విభేదాలే బీజేపీ గెలుపుకు కారణమయ్యాయని ఉద్ధవ్ ఠాక్రే శివసేన తెలిపింది. శివసేన-యూబీటీ మౌత్ పీస్ పత్రిక ‘‘సామ్నా’’లోని సంపాదకీయంలో.. ఆప్, కాంగ్రెస్ తన ప్రత్యర్థి బీజేపీతో కాకుండా తమలో తాము పోరాడాయని, ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షాల మధ్య పొత్తులు ఎందుకు..? అని ప్రశ్నించింది.
‘‘ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి పోరాడాయి. దీని వలన ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు పని సులభతరం అయింది. ఇది ఇలాగే కొనసాగితే పొత్తులు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి..? మీ మనసుకు నచ్చినంత వరకు పోరాడండి’’ అంటూ కఠినంగా వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితులే మహారాష్ట్రలో కూడా నిరాశను కలిగించాయని చెప్పింది. ఢిల్లీ ఎన్నికల నుంచి ప్రతిపక్షాలు గుణపాఠాలు నేర్చుకోకుంటే, మోడీ-షాల ‘‘నిరంకుశ పాలన’’ బలోపేతమవుతుందని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!