Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- చైనా, అమెరికా సాయాన్ని తిరస్కరిస్తున్న నేపాల్..
- భారత సాయానికి ఓకే..
- 2015 భూకంప సమయంలో ఎదురైన అనుభవాలే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: నేపాల్లో వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. భోటెకోశి నది ఉప్పెనలా విరుచుకుపడటంతో చైనా సరిహద్దుల్లో ఉన్న నేపాల్ జిల్లాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు 500 మందికి పైగా మరణించగా, 1000 మందికి పైగా గల్లంతయ్యారు. సాయం చేస్తామని ప్రపంచదేశాలు ముందుకొస్తున్నా నేపాల్ సాయాన్ని మాత్రం వద్దని చెబుతోంది. చైనా, అమెరికా సహా పలు దేశాల నుంచి నేపాల్ సాయాన్ని తిరస్కరించింది. సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించడానికి సొంత భద్రతా సంస్థలు పూర్తి సామర్థ్యం ఉందని నేపాల్ చెప్పింది.
చైనా, అమెరికా సహా పలు దేశాలు నేపాల్కు హెలికాప్టర్లు, సహాయక బృందాన్ని పంపుతామని కోరాయి. అయితే, 2015 భూకంపం తర్వాత తమకున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నేపాల్ ఈ సాయాన్ని సున్నితంగా తోసిపుచ్చుతోంది. 2015 భూకంపం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ బృందాలు, సైనిక విమానాలు, విదేశీ సహాయ సంస్థల తాకిడితో కాఠ్మాండు విమానాశ్రయం, పరిపాలన వ్యవస్థ కుప్పకూలిపోయింది. విదేశీ బృందాల మధ్య సమన్వయ లోపం, పోటీ సంక్షోభాన్ని తగ్గించకపోగా, మరింత పెంచాయి. దీంతో నేపాల్ ఈ సారి విదేశీ సాయాన్ని తిరస్కరిస్తోంది.
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్లైన్స్పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
భారత సాయాన్ని స్వీకరించిన నేపాల్..
అయితే, సహాయక సామాగ్రి, వైద్య సామాగ్రి, ఆర్థిక విరాళాలను తాము స్వీకరిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. భారత విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకారం.. సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ భారత్ సహాయాన్ని కోరినట్లు చెప్పింది. భారతదేశం ఒక టన్నెల్ రెస్క్యూ బృందాన్ని, ఆ తర్వాత భూగర్భ పరిస్థితులను, పరికరాల అవసరాలను అంచనా వేయడానికి ఒక పరిశీలనా బృందాన్ని పంపడానికి సిద్ధమవుతోంది. ఒక వైద్య బృందాన్ని కూడా పంపుతున్నారు.
భారత్ ప్రభుత్వం ఇప్పటికే వైమానిక దళానికి చెందిన సి-130జె మరియు సి-17 గ్లోబ్మాస్టర్ విమానాల ద్వారా 47.5 టన్నుల సహాయక సామగ్రిని పంపింది. ఇందులో తాత్కాలిక గుడారాలు, దుప్పట్లు, మందులు, సోలార్ దీపాలు , ఆహార ప్యాకెట్లు ఉన్నాయి. దెబ్బతిన్న వంతెనల స్థానంలో లోయ వంతెనలు,ప్రీఫ్యాబ్రికేటెడ్ వంతెనలను నిర్మిస్తామని కూడా భారతదేశం ముందుకొచ్చింది. నేపాల్ అభ్యర్థించిన సహాయం మేరకు చర్యలు తీసుకుంటుందని విదేశాంగ ప్రతినిధి రణధీన్ జైస్వాల్ చెప్పారు.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!