CPI General Secretary D Raja: ఇండియాపై ట్రంప్ పెత్తనమేంటి..?
- ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెత్తనమేంటి..?..
- ప్రధాని మోడీ నేతృత్వంలో భారతదేశం సురక్షితంగా లేదు..
- భారత్ కు ట్రంప్ సలహాలు అవసరం లేదన్న సీపీఐ నేత రాజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI General Secretary D Raja: ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెత్తనమేంటి..? అని మండిపడ్డారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. తిరుపతిలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం సురక్షితంగా లేదు.. అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. అయితే, భారత్ కు ట్రంప్ సలహాలు అవసరం లేదన్న ఆయన.. అసలు ఇండియాపై ట్రంప్ పెత్తనమేంటి..? అని నిలదీశారు.. మరోవైపు, అఖిలపక్షం ఏర్పాటు చేస్తే మోడీ ఎందుకు రావడం లేదు..? అని ప్రశ్నించారు.. అఖిలపక్ష సమావేశానికి వస్తే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారనే భయం ప్రధాని మోడీలో ఉందన్నారు రాజా..
Read Also: Tragedy : సగటు భార్యలా ఉంది… కానీ కాదు.. ఆమె ఆటలో భర్త ప్రాణం బలి..!
Also Read
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
ఉగ్రవాదులకు మేం వ్యతిరేకం అని స్పష్టం చేశారు డి. రాజా.. పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో భారతీయులపై దాడి బాధాకరమన్న ఆయన.. భారత్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించేంత వరకు కేంద్ర నిఘా వర్గాలు ఏం చేశాయి..? అని ప్రశ్నించారు.. భారత్ లో పర్యాటకుల మృతిపై ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పడం లేదని దుయ్యబట్టారు.. పహల్గామ్ ఘటనపై పార్లమెంట్ లో ప్రత్యేక చర్చ జరగాల్సిన అవసరం ఉందని.. చర్చ జరిగితే పార్లమెంటు వేదికగా మోడీని నిలదీస్తారని వ్యాఖ్యానించారు. ఇక, మావోయిస్టులపై కేంద్రప్రభుత్వం ప్రతాపం చూపిస్తానంటోంది.. ఉగ్రవాదులను పిలిచి మాట్లాడాలనుకునే కేంద్రం.. మావోయిస్టులను ఎందుకు పిలిచి మాట్లాడరు? అని ప్రశ్నించారు. చర్చలకు వస్తానంటున్న మావోయిస్టులను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని నిలదీశారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా..
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..