CPI General Secretary D Raja: ఇండియాపై ట్రంప్ పెత్తనమేంటి..?
- ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెత్తనమేంటి..?..
- ప్రధాని మోడీ నేతృత్వంలో భారతదేశం సురక్షితంగా లేదు..
- భారత్ కు ట్రంప్ సలహాలు అవసరం లేదన్న సీపీఐ నేత రాజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI General Secretary D Raja: ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెత్తనమేంటి..? అని మండిపడ్డారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. తిరుపతిలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం సురక్షితంగా లేదు.. అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. అయితే, భారత్ కు ట్రంప్ సలహాలు అవసరం లేదన్న ఆయన.. అసలు ఇండియాపై ట్రంప్ పెత్తనమేంటి..? అని నిలదీశారు.. మరోవైపు, అఖిలపక్షం ఏర్పాటు చేస్తే మోడీ ఎందుకు రావడం లేదు..? అని ప్రశ్నించారు.. అఖిలపక్ష సమావేశానికి వస్తే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారనే భయం ప్రధాని మోడీలో ఉందన్నారు రాజా..
Read Also: Tragedy : సగటు భార్యలా ఉంది… కానీ కాదు.. ఆమె ఆటలో భర్త ప్రాణం బలి..!
Also Read
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
ఉగ్రవాదులకు మేం వ్యతిరేకం అని స్పష్టం చేశారు డి. రాజా.. పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో భారతీయులపై దాడి బాధాకరమన్న ఆయన.. భారత్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించేంత వరకు కేంద్ర నిఘా వర్గాలు ఏం చేశాయి..? అని ప్రశ్నించారు.. భారత్ లో పర్యాటకుల మృతిపై ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పడం లేదని దుయ్యబట్టారు.. పహల్గామ్ ఘటనపై పార్లమెంట్ లో ప్రత్యేక చర్చ జరగాల్సిన అవసరం ఉందని.. చర్చ జరిగితే పార్లమెంటు వేదికగా మోడీని నిలదీస్తారని వ్యాఖ్యానించారు. ఇక, మావోయిస్టులపై కేంద్రప్రభుత్వం ప్రతాపం చూపిస్తానంటోంది.. ఉగ్రవాదులను పిలిచి మాట్లాడాలనుకునే కేంద్రం.. మావోయిస్టులను ఎందుకు పిలిచి మాట్లాడరు? అని ప్రశ్నించారు. చర్చలకు వస్తానంటున్న మావోయిస్టులను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని నిలదీశారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా..
తాజావార్తలు
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!