CPI General Secretary D Raja: ఇండియాపై ట్రంప్ పెత్తనమేంటి..?
- ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెత్తనమేంటి..?..
- ప్రధాని మోడీ నేతృత్వంలో భారతదేశం సురక్షితంగా లేదు..
- భారత్ కు ట్రంప్ సలహాలు అవసరం లేదన్న సీపీఐ నేత రాజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI General Secretary D Raja: ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెత్తనమేంటి..? అని మండిపడ్డారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. తిరుపతిలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం సురక్షితంగా లేదు.. అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. అయితే, భారత్ కు ట్రంప్ సలహాలు అవసరం లేదన్న ఆయన.. అసలు ఇండియాపై ట్రంప్ పెత్తనమేంటి..? అని నిలదీశారు.. మరోవైపు, అఖిలపక్షం ఏర్పాటు చేస్తే మోడీ ఎందుకు రావడం లేదు..? అని ప్రశ్నించారు.. అఖిలపక్ష సమావేశానికి వస్తే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారనే భయం ప్రధాని మోడీలో ఉందన్నారు రాజా..
Read Also: Tragedy : సగటు భార్యలా ఉంది… కానీ కాదు.. ఆమె ఆటలో భర్త ప్రాణం బలి..!
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
ఉగ్రవాదులకు మేం వ్యతిరేకం అని స్పష్టం చేశారు డి. రాజా.. పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో భారతీయులపై దాడి బాధాకరమన్న ఆయన.. భారత్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించేంత వరకు కేంద్ర నిఘా వర్గాలు ఏం చేశాయి..? అని ప్రశ్నించారు.. భారత్ లో పర్యాటకుల మృతిపై ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పడం లేదని దుయ్యబట్టారు.. పహల్గామ్ ఘటనపై పార్లమెంట్ లో ప్రత్యేక చర్చ జరగాల్సిన అవసరం ఉందని.. చర్చ జరిగితే పార్లమెంటు వేదికగా మోడీని నిలదీస్తారని వ్యాఖ్యానించారు. ఇక, మావోయిస్టులపై కేంద్రప్రభుత్వం ప్రతాపం చూపిస్తానంటోంది.. ఉగ్రవాదులను పిలిచి మాట్లాడాలనుకునే కేంద్రం.. మావోయిస్టులను ఎందుకు పిలిచి మాట్లాడరు? అని ప్రశ్నించారు. చర్చలకు వస్తానంటున్న మావోయిస్టులను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని నిలదీశారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా..
తాజావార్తలు
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!