Shashi Tharoor: బీజేపీకి సూటి ప్రశ్న.. ముస్లిం ప్రధాని అయ్యేనా?
Shashi Tharoor: బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక అవ్వడంపై.. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అనూహ్యంగా స్పందించారు. భారత సంతతికి చెందిన ఒక హిందువు బ్రిటన్కి ప్రధాని కావడం ఒక పాఠం వంటిదని సూచించిన ఆయన.. మన దేశంలో హిందువు, సిక్కు, బౌద్ధ, జైన మతస్తులు కాకుండా ఇతరులు ప్రధాని అవ్వగలరా? అని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ ప్రోద్బలిత రాజకీయాలు బాగా నడుస్తున్న ప్రస్తుత కాలంలో.. అలాంటిది సాధ్యమవుతుందా? అలా జరుగుతుందని ఊహించగలమా? అని నిలదీశారు.
‘‘మన భారత ఉపఖండంలో ఎన్నో మతాలు జన్మించాయి. ఆ మతాలను హిందుత్వ భావజాలం సమానంగానే చూస్తుంది. కానీ.. హిందుత్వ వాదులే ఇతరుల్ని సమానంగా చూడలేకపోతున్నారు’’ అని శశి థరూర్ చురకలు అంటించారు. గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ మన హిందువులు, హిందూ మతాన్ని ఉద్దేశించి ‘‘అటవిక ప్రజలు, అటవిక మతం’’ అని చేసిన వ్యాఖ్యల్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆ బ్రిటన్ దేశానికే హిందుత్వవాది అయిన రిషీ సునాక్ ప్రధాని అయ్యాడన్నారు. మరి.. అదే రీతిలో బీజేపీ ఒక క్రైస్తవుడ్ని గానీ, ముస్లింని గానీ భారత ప్రధాని పీఠంపై కూర్చోబెడుతుందా? అని ప్రశ్నించారు. అలాగే.. క్రిస్టియన్గా ముద్రపడిన ఇటలీ దేశస్తురాలు సోనియా గాంధీ ప్రధాని అయితే, తాను శిరోముండనం చేయించుకుంటానని సుష్మాస్వరాజ్ చేసిన వ్యాఖ్యల్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.
Also Read
- Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
- Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
ఇదిలావుండగా.. ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం శశి థరూర్ పోటీ పడిన విషయం తెలిసిందే! అయితే.. సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే చేతిలో ఆయన ఘోర పరాజయం చవిచూశారు. గాంధీ కుటుంబంతో పాటు సీనియర్ల సపోర్ట్ ఉండటంతో.. ఖర్గే భారీ మోజారిటీతో ఈ ఎన్నికల్లో గెలిచారు.
తాజావార్తలు
-
Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!