Uttar Pradesh: కాన్పూర్-ఢిల్లీ హైవేపై నగ్నంగా, తల లేకుండా మహిళ మృతదేహం..
- ఉత్తర్ ప్రదేశ్ హైవేపై నగ్నంగా తలలేని స్థితిలో మహిళ డెడ్బాడీ..
- హత్య.. ప్రమాదం కోణంలో పోలీసులు దర్యాప్తు..
- ఘటనపై పొలిటికల్ దుమారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్-ఢిల్లీ హైవేపై నగ్నంగా, తల లేని స్థితిలో మహిళ మృతదేహం కనిపించడం సంచలనంగా మారింది. మహిళ ఎముకలు, దంతాలు విరిగిపోయి ఉన్నాయని యూపీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రస్తుతం పోలీసులు విచారణ ప్రారంభించారు. గుజైనిలోని హైవేపై మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. బుధవారం ఈ విషయాన్ని గమనించి స్థానిక పోలీసులు సమాచారం అందించారు.
ఈ కేసులో పోలీసులు ఇంకా పురోగతి సాధించలేదు. మహిళ గుర్తింపుని నిర్ధారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేశం దగ్గర ఎలాంటి మొబైల్ ఫోన్, బ్యాగ్, ఐడీ కార్డు లాంటి ఏం దొరకలేదని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(సౌత్) రవీందర్ కుమార్ తెలిపారు. “మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు. శరీరంపై మొద్దుబారిన వస్తువు ఉన్న గుర్తులు ఉన్నాయి. ఈ కేసును హత్యతో పాటు ప్రమాద కోణంలో కూడా విచారిస్తున్నాము” అని డీసీపీ చెప్పారు.
Also Read
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
- BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్.. నేడు మోడీతో కీలక భేటీ
Read Also: Syphilis Virus: ఆ దేశంలో వేగంగా పెరుగుతున్న సిఫిలిస్ వైరస్ కేసులు.. బాధితుల్లో పురుషులు అధికం!
ఈ కేసుని ఛేదించేందుకు పోలీసులు హైవేపై, చుట్టుపక్కట ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళ మరణానికి తక్షణ కారణం స్పష్టంగా తెలియనప్పటికీ, ప్రమాదం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘‘పెద్ద వాహనం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు, దీని వల్లే తల తెగిపోలేదు, గాయం కారణంగా పగిలిపోయింది. బట్టలు కూడా దొరికాయి. పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలు వెల్లడవుతాయి’’ అని కాన్పూర్ ఏసీపీ హరీష్ చంద్ర అన్నారు.
అయితే, ఈ ఘటనపై యూపీలో పొలిటికల్ దుమారం చెలరేగింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రతిపక్షాలు యోగి సర్కార్పై విమర్శలకు దిగాయి. ‘‘”యుపిలో మహిళలపై జరిగిన మరో హృదయ విదారక సంఘటనలో, కాన్పూర్ హైవేపై తల లేని, నగ్నంగా ఉన్న మహిళ మృతదేహం కనుగొనబడింది. మరణించిన వారిపై క్రూరమైన హింస మరియు అపారమైన శారీరక హింసకు సంబంధించిన సాక్ష్యాలను ప్రస్తావించకూడదని నైతికత చెబుతోంది.” అని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు.
తాజావార్తలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్కు సపోర్ట్
-
Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
-
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్నెస్కు ఫ్యాన్స్ ఫిదా!
-
Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!