Uttar Pradesh: కాన్పూర్-ఢిల్లీ హైవేపై నగ్నంగా, తల లేకుండా మహిళ మృతదేహం..
- ఉత్తర్ ప్రదేశ్ హైవేపై నగ్నంగా తలలేని స్థితిలో మహిళ డెడ్బాడీ..
- హత్య.. ప్రమాదం కోణంలో పోలీసులు దర్యాప్తు..
- ఘటనపై పొలిటికల్ దుమారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్-ఢిల్లీ హైవేపై నగ్నంగా, తల లేని స్థితిలో మహిళ మృతదేహం కనిపించడం సంచలనంగా మారింది. మహిళ ఎముకలు, దంతాలు విరిగిపోయి ఉన్నాయని యూపీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రస్తుతం పోలీసులు విచారణ ప్రారంభించారు. గుజైనిలోని హైవేపై మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. బుధవారం ఈ విషయాన్ని గమనించి స్థానిక పోలీసులు సమాచారం అందించారు.
ఈ కేసులో పోలీసులు ఇంకా పురోగతి సాధించలేదు. మహిళ గుర్తింపుని నిర్ధారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేశం దగ్గర ఎలాంటి మొబైల్ ఫోన్, బ్యాగ్, ఐడీ కార్డు లాంటి ఏం దొరకలేదని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(సౌత్) రవీందర్ కుమార్ తెలిపారు. “మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు. శరీరంపై మొద్దుబారిన వస్తువు ఉన్న గుర్తులు ఉన్నాయి. ఈ కేసును హత్యతో పాటు ప్రమాద కోణంలో కూడా విచారిస్తున్నాము” అని డీసీపీ చెప్పారు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
Read Also: Syphilis Virus: ఆ దేశంలో వేగంగా పెరుగుతున్న సిఫిలిస్ వైరస్ కేసులు.. బాధితుల్లో పురుషులు అధికం!
ఈ కేసుని ఛేదించేందుకు పోలీసులు హైవేపై, చుట్టుపక్కట ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళ మరణానికి తక్షణ కారణం స్పష్టంగా తెలియనప్పటికీ, ప్రమాదం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘‘పెద్ద వాహనం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు, దీని వల్లే తల తెగిపోలేదు, గాయం కారణంగా పగిలిపోయింది. బట్టలు కూడా దొరికాయి. పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలు వెల్లడవుతాయి’’ అని కాన్పూర్ ఏసీపీ హరీష్ చంద్ర అన్నారు.
అయితే, ఈ ఘటనపై యూపీలో పొలిటికల్ దుమారం చెలరేగింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రతిపక్షాలు యోగి సర్కార్పై విమర్శలకు దిగాయి. ‘‘”యుపిలో మహిళలపై జరిగిన మరో హృదయ విదారక సంఘటనలో, కాన్పూర్ హైవేపై తల లేని, నగ్నంగా ఉన్న మహిళ మృతదేహం కనుగొనబడింది. మరణించిన వారిపై క్రూరమైన హింస మరియు అపారమైన శారీరక హింసకు సంబంధించిన సాక్ష్యాలను ప్రస్తావించకూడదని నైతికత చెబుతోంది.” అని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు.
తాజావార్తలు
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!