Bomb threats: మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు.. రెండు రోజుల్లో 12 విమానాలకు హెచ్చరికలు..
- ఈ రోజు మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు..
- రెండు రోజుల వ్యవధిలో 12 విమానాలకు నకిలీ బాంబు కాల్స్..
- విషయాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb threats: దేశంలో వరసగా విమానాలు బాంబు బెదిరింపులు ఎదుర్కొంటున్నాయి. బుధవారం కూడా మరో రెండు విమానాలకు ఇలాంటి వార్నింగ్స్ వచ్చాయి. ఢిల్లీ నుంచి బెంగళూర్కి బయలుదేరే ఆకాసా ఎయిర్ విమానానికి, ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానానికి బెదిరింపులు వచ్చాయి. రెండు రోజుల్లో ఇలా 12 విమానాలకు నకిలీ బెదిరింపులు రావడం సంచలనంగా మారాయి. ఆకాస QP 1335 విమానంలో 177 మంది ఉన్నారని, అందులో ముగ్గురు శిశువులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారని అకాసా ఎయిర్ ప్రతినిధి తెలిపారు. ఢిల్లీకి తిరిగి వచ్చినట్లు చెప్పారు. ఇండిగోకి చెందిన 6E 651 ముంబై-ఢిల్లీ విమానం అహ్మదాబాద్కు దారి మళ్లించబడింది. ప్రయాణికులందర్ని సురక్షితంగా దించామని ఇండిగో ప్రతినిధి చెప్పారు.
Read Also: MUDA Scam: సీఎం సిద్ధరామయ్యకి షాక్.. ముడా చైర్మన్ రాజీనామా..
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
అంతకుముందు మంగళవారం ఎయిర్ ఇండియా ఢిల్లీ-చికాగో విమానం కాకుండా, డమ్మమ్-లక్నో ఇండిగో విమానం, అయోధ్య-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, దర్భంగా నుండి ముంబైకి స్పైస్జెట్ విమానం (SG116), బాగ్డోగ్రా నుండి బెంగళూరుకు అకాస ఎయిర్ విమానం (QP 1373) అలయన్స్ ఎయిర్ అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానానికి (9ఐ 650), మదురై నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి (ఐఎక్స్ 684)కి బాంబు బెదిరింపులు వచ్చాయి.
సోమవారం రెండు ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా విమానాకి ఇలాగే బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా వరసగా బెదిరింపులు వస్తుండటం, విమాన ఆపరేషన్స్కి ఇబ్బందులు తలెత్తడంతో ఈ అంశంపై ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. దీనికి ముందు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీసీజీఏ అధికారులతో ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. దీంట్లో కొందరు నిందితులను అధికారులు గుర్తించనట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!