Bomb threats: మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు.. రెండు రోజుల్లో 12 విమానాలకు హెచ్చరికలు..
- ఈ రోజు మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు..
- రెండు రోజుల వ్యవధిలో 12 విమానాలకు నకిలీ బాంబు కాల్స్..
- విషయాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb threats: దేశంలో వరసగా విమానాలు బాంబు బెదిరింపులు ఎదుర్కొంటున్నాయి. బుధవారం కూడా మరో రెండు విమానాలకు ఇలాంటి వార్నింగ్స్ వచ్చాయి. ఢిల్లీ నుంచి బెంగళూర్కి బయలుదేరే ఆకాసా ఎయిర్ విమానానికి, ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానానికి బెదిరింపులు వచ్చాయి. రెండు రోజుల్లో ఇలా 12 విమానాలకు నకిలీ బెదిరింపులు రావడం సంచలనంగా మారాయి. ఆకాస QP 1335 విమానంలో 177 మంది ఉన్నారని, అందులో ముగ్గురు శిశువులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారని అకాసా ఎయిర్ ప్రతినిధి తెలిపారు. ఢిల్లీకి తిరిగి వచ్చినట్లు చెప్పారు. ఇండిగోకి చెందిన 6E 651 ముంబై-ఢిల్లీ విమానం అహ్మదాబాద్కు దారి మళ్లించబడింది. ప్రయాణికులందర్ని సురక్షితంగా దించామని ఇండిగో ప్రతినిధి చెప్పారు.
Read Also: MUDA Scam: సీఎం సిద్ధరామయ్యకి షాక్.. ముడా చైర్మన్ రాజీనామా..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
అంతకుముందు మంగళవారం ఎయిర్ ఇండియా ఢిల్లీ-చికాగో విమానం కాకుండా, డమ్మమ్-లక్నో ఇండిగో విమానం, అయోధ్య-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, దర్భంగా నుండి ముంబైకి స్పైస్జెట్ విమానం (SG116), బాగ్డోగ్రా నుండి బెంగళూరుకు అకాస ఎయిర్ విమానం (QP 1373) అలయన్స్ ఎయిర్ అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానానికి (9ఐ 650), మదురై నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి (ఐఎక్స్ 684)కి బాంబు బెదిరింపులు వచ్చాయి.
సోమవారం రెండు ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా విమానాకి ఇలాగే బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా వరసగా బెదిరింపులు వస్తుండటం, విమాన ఆపరేషన్స్కి ఇబ్బందులు తలెత్తడంతో ఈ అంశంపై ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. దీనికి ముందు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీసీజీఏ అధికారులతో ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. దీంట్లో కొందరు నిందితులను అధికారులు గుర్తించనట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
-
Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!