MUDA Scam: సీఎం సిద్ధరామయ్యకి షాక్.. ముడా చైర్మన్ రాజీనామా..
- ముడా స్కామ్లో సంచలనం..
- ముడా చీఫ్ మరిగౌడ రాజీనామా..
- సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడిగా పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MUDA Scam: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్లో చిక్కుకున్నారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉంటే, తాజాగా సిద్ధరామయ్యకి మరో షాక్ తగిలింది. ముడా చీఫ్ మరిగౌడ ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ బుధవారం రాజీనామా చేయడం సంచలనంగా మారింది. మరిగౌడ, సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు. దీర్ఘకాలిక మిత్రడు. 1983 నుంచి సిద్ధరామయ్యతో కలిసి పనిచేస్తున్నాడు. 1995లో మైసూర్ తాలూకు పంచాయతీ అధ్యక్షుడిగా, 2000లో జిల్లా పంచాయతీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. మరిగౌడ రాజీనామాపై సిద్ధరామయ్య ఇంకా స్పందించలేదు.
Read Also: India-Canada Row: ఇండియాపై కెనడా ఆంక్షలు విధిస్తే.. భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు..?
Also Read
- India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
సీఎం సిద్ధరామయ్యపై మైసూర్ లోకాయుక్త, ఈడీ కేసులు పెట్టింది. ఇదే కాకుండా సీఎం సాక్ష్యాలు నాశనం చేసిన ఆరోపణల్ని కూడా ఎదుర్కొంటున్నాడు. ఈ నెల ప్రారంభంలోనే ఈడీకి ఫిర్యాదు వెళ్లింది. మైసూర్ నగరాభివృద్ధి కోసం సీఎం భార్య పార్వతి నుంచి మూడెకరాల భూమిని తీసుకుంది. అయితే, దీనికి ప్రతిఫలంగా పొందిన భూమి ఇచ్చిన భూమి కన్నా కొన్ని రెట్లు విలువైనది కావడంతో వివాదం ప్రారంభమైంది. మైసూర్లో అత్యంత విలువైన విజయనగర్ ప్రాంతంలో 14 ప్లాట్లను కేటాయించడం మొత్తం వివాదాస్పదంగా మారింది.
ఈ కేసుపై పలువురు యాక్టివిస్టులు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్కి ఫిర్యాదు చేయడంతో అసలు కథ మొదలైంది. గవర్నర్ సీఎం సిద్ధరామయ్యపై విచారణకు ఆదేశించారు. అయితే, ఈ ఆదేశాలను కర్ణాటక హైకోర్టులో సీఎం సవాల్ చేశారు. అయితే, విచారించిన హైకోర్టు సీఎం విచారణ ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ బీజేపీ, జేడీఎస్ విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!