MUDA Scam: సీఎం సిద్ధరామయ్యకి షాక్.. ముడా చైర్మన్ రాజీనామా..
- ముడా స్కామ్లో సంచలనం..
- ముడా చీఫ్ మరిగౌడ రాజీనామా..
- సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడిగా పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MUDA Scam: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్లో చిక్కుకున్నారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉంటే, తాజాగా సిద్ధరామయ్యకి మరో షాక్ తగిలింది. ముడా చీఫ్ మరిగౌడ ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ బుధవారం రాజీనామా చేయడం సంచలనంగా మారింది. మరిగౌడ, సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు. దీర్ఘకాలిక మిత్రడు. 1983 నుంచి సిద్ధరామయ్యతో కలిసి పనిచేస్తున్నాడు. 1995లో మైసూర్ తాలూకు పంచాయతీ అధ్యక్షుడిగా, 2000లో జిల్లా పంచాయతీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. మరిగౌడ రాజీనామాపై సిద్ధరామయ్య ఇంకా స్పందించలేదు.
Read Also: India-Canada Row: ఇండియాపై కెనడా ఆంక్షలు విధిస్తే.. భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు..?
Also Read
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
సీఎం సిద్ధరామయ్యపై మైసూర్ లోకాయుక్త, ఈడీ కేసులు పెట్టింది. ఇదే కాకుండా సీఎం సాక్ష్యాలు నాశనం చేసిన ఆరోపణల్ని కూడా ఎదుర్కొంటున్నాడు. ఈ నెల ప్రారంభంలోనే ఈడీకి ఫిర్యాదు వెళ్లింది. మైసూర్ నగరాభివృద్ధి కోసం సీఎం భార్య పార్వతి నుంచి మూడెకరాల భూమిని తీసుకుంది. అయితే, దీనికి ప్రతిఫలంగా పొందిన భూమి ఇచ్చిన భూమి కన్నా కొన్ని రెట్లు విలువైనది కావడంతో వివాదం ప్రారంభమైంది. మైసూర్లో అత్యంత విలువైన విజయనగర్ ప్రాంతంలో 14 ప్లాట్లను కేటాయించడం మొత్తం వివాదాస్పదంగా మారింది.
ఈ కేసుపై పలువురు యాక్టివిస్టులు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్కి ఫిర్యాదు చేయడంతో అసలు కథ మొదలైంది. గవర్నర్ సీఎం సిద్ధరామయ్యపై విచారణకు ఆదేశించారు. అయితే, ఈ ఆదేశాలను కర్ణాటక హైకోర్టులో సీఎం సవాల్ చేశారు. అయితే, విచారించిన హైకోర్టు సీఎం విచారణ ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ బీజేపీ, జేడీఎస్ విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!