Sengol: పార్లమెంట్లో ‘‘సెంగోల్’’ స్థానంలో రాజ్యాంగం పెట్టాలి.. అఖిలేష్ పార్టీ ఎంపీ డిమాండ్..
- మరోసారి చర్చనీయాంశంగా ‘‘సెంగోల్’’
- సెంగోల్ స్థానంతో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలి
- సమాజ్వాదీ ఎంపీ డిమాండ్
- భారతీయ సంస్కృతిపై ఇండియా కూటమికి గౌరవం లేదన్న బీజేపీ
- డీఎంకే దీనిపై ఎలా స్పందిస్తుందో చెప్పాలన్న సీఎం యోగి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sengol: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభ సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ‘సెంగోల్’ని ప్రతిష్టించారు. ఆ సమయంలో ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ సెంగోల్ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ(ఎస్పీ)కి చెందిన ఎంపీ ఆర్కే చౌదరి సెంగోల్ స్థానంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. 5 అడుగుల పొడవు, బంగారు పూతతో చేతితో తయారు చేసిన సెంగోల్ గురించి మరోసారి చర్చ మొదలైంది.
యూపీ మోహన్లాల్ గంజ్ ఎంపీగా ఉన్న చౌదరి సెంగోల్ స్థానంలో రాజ్యాంగం తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని ఆమోదించడం దేశంలో ప్రజాస్వామ్యానికి నాంది పలికింది, రాజ్యాంగం దాని చిహ్నం. బిజెపి ప్రభుత్వం తన చివరి టర్మ్లో స్పీకర్ కుర్చీ పక్కన ‘సెంగోల్’ని ఏర్పాటు చేసింది. సెంగోల్ అనేది తమిళ పదం, దీని అర్థం రాజదండం. రాజ్దండ్ కూడా రాజుల యుగం తర్వాత మనం స్వతంత్రులం అయ్యాం అని అర్థం. ప్రస్తుతం ప్రతీ ఒక్కరు కూడా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని దేశంలో ఎన్నుకుంటున్నారు. దేశం రాజ్యాంగం ఆధారంగా నడుస్తుంది. రాజదండం ద్వారా కాదు.’’ అని అతను అన్నారు.
Also Read
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
Read Also: Addanki Dayakar : బీఆర్ఎస్కు అసెంబ్లీలో ఏ అంశాలు ఎత్తుకోవాలని తెలవడం లేదు
ఈ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్లోని 80 ఎంపీ స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ 37 సీట్లను గెలుచుకుంది. పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత ఎస్పీ మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. పార్టీ ఎంపీ వ్యాఖ్యపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. సెంగోల్ పెట్టిన సమయంలో ప్రధాని దానికి నమస్కరించారు, కానీ ఈ సారి ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ఆయన నమస్కరించడం మరిచిపోయారని, మా ఎంపీ ప్రధానికి గుర్తు చేయాలనునకుంటున్నారని నేను భావిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్, ఆర్జేడీ ఎంపీ లాలూ కుమార్తె మిసా భారతి కూడా ఎస్పీ ఎంపీ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు.
అయితే, ఎస్పీ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. సమాజ్వాదీ పార్టీకి భారతీయ చరిత్ర, సంస్కృతి పట్ల గౌరవం లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తమిళ సంస్కృతి పట్ల భారత కూటమి యొక్క ద్వేషాన్ని చూపిస్తోందని యోగి అన్నారు. గతంలో ఎస్పీ రామచరితమానస్పై దాడి చేసిందని, ఇప్పుడు భారత సంస్కృతిపై దాడి చేసిందని చెప్పారు. ఈ అవమానికి డీఎంకే ఎలా స్పందిస్తుందో చెప్పాలని యోగి అన్నారు.
తాజావార్తలు
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!