RSS: బక్రీద్ రోజు ఆవులను దానం చేయాలని, బలివ్వకూడదని ఆర్ఎస్ఎస్-ముస్లిం మంచ్ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అనుబంధిత ముస్లిం రాష్ట్రీయ మంచ్ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈద్ ఉల్ జుహా(బక్రీద్) సందర్భంగా ఆవులను దానం చేసి సేవించాలని నిర్ణయించినట్లు ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు ఆదివారం తెలిపారు. భోపాల్ లో జరిగిన ముస్లిం మంచ్ మేథోమథన సదస్సు ముగింపు రోజున ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. మంచ్ సభ్యులు యోగా దినోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. భారతీయులందరికీ ఒకే మూలాలు, ఒకే డీఎన్ఏ ఉందని ఆయన అన్నారు.
ఈద్ ఉల్ జుహాపై ప్రజల్లో అపోహ ఉందని, దీనిని కొందరు బక్రా ఈద్ గా పిలుస్తారని ఆయన అన్నారు. బక్రా అంటే మేక అని కొందరు అర్థం చేసుకుంటారు, కానీ అరబిక్ ప్రపంచంలో బక్రా అంటే ఆవును సూచిస్తుందని తెలిపారు. ముస్లిం మంచ్ సభ్యులు ఆవులను సేవిస్తారని, వాటిని దానం చేస్తారని, వాటిని బలివ్వకూడదనే ప్రతిపాదనను ఆమోదించారని వెల్లడించారు. ఆవులను బలి ఇవ్వకూడదని మంచ్ విజ్ఞప్తి చేస్తుంది అని ఇంద్రేష్ కుమార్ అన్నారు.
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
Read Also: CPI Narayana: ప్రజాగర్జన సాక్షిగా.. సీఎం కేసీఆర్కి సీపీఐ నారాయణ సూటి ప్రశ్నలు
మంచ్లోని 2,500 యూనిట్లు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాయని తెలిపారు. యోగా శరీరం, మనస్సు, ఆత్మను స్వస్థపరిచే మార్గం అని, దీనికి కులం,మతంతో సంబంధం లేదని అన్నారు. మంచ్ సభ్యులు రక్షా బంధన్ కూడా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారని, ఇది మతపరమైన పండగ కాదని చెప్పారు. రక్షా బంధన్ అనేది మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన పండగ అని, పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు దీనిని పాటిస్తారని పేర్కొన్నారు. ప్రపంచంలో అల్లర్లు లేకుండా మతం, కులం వివక్షను తొలగించేందుకు రక్షాబంధన్ సందర్భంగా మంచ్ 100 చోట్ల భారీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు.
ఈ ఏడాది ఆగస్ట్ 20 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రజా సంప్రదింపు ప్రచారం నిర్వహిస్తారని, ఈ సందర్భంగా మంచ్ సభ్యులు 15 లక్షల కుటుంబాలను కలిసి, దేశంలో కలహాలు, వివక్ష రహితంగా మార్చడానికి, సోదరభావాన్ని వ్యాప్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘‘ఒకే దేశం, ఒకే చట్టం’’, జనాభా నియంత్రణ, లవ్ జిహాద్, యూనిఫా సివిల్ కోడ్ తీర్మానాలతో సహా 11 తీర్మానాలను ఆమోదించింది.
తాజావార్తలు
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!