Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Roopa Vs Rohini They Must Be Punished Says Home Minister

Karnataka: రోహిణి వర్సెస్ రూప.. రచ్చకెక్కిన సివిల్ సర్వెంట్లు.. ప్రభుత్వం ఆగ్రహం..

Published Date :February 21, 2023 , 7:17 am
By BV Reddy
Karnataka: రోహిణి వర్సెస్ రూప.. రచ్చకెక్కిన సివిల్ సర్వెంట్లు.. ప్రభుత్వం ఆగ్రహం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Roopa vs Rohini: కర్ణాటకలో ఇద్దరు మహిళా సివిల్ అధికారుల మధ్య వార్ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. కర్ణాటక దేవాదాయ కమిషనర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిపై కర్ణాటక హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ రూపా డి. మౌద్గిల్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఫేస్ బుక్ వేదికగా రూపా, రోహిణి ఫోటోలు షేర్ చేసి ఆరోపణలు చేశారు. రోహిణి సివిల్ సర్వెంట్ అధికారుల నియమావళిని ఉల్లంఘించారని, రోహిణి అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై స్పందించిన రోహిణి.. రూప మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని.. నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సోమవారం ప్రభుత్వ సీఎస్ వందితా శర్మను కలుసుకున్న రోహిణి, రూపపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మరోవైపు రోహిణి ఫోన్ తో పాటు తన ఫోన్ హ్యాక్ అయిందంటూ ఆమె భర్త సుధీర్ రెడ్డి బాగలగుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మైసూర్ జిల్లా కలెక్టర్ గా రోహిణి పనిచేస్తున్న సమయంలో అప్పటి మంత్రి మహేష్ తో విభేదాలు ఉన్నాయి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మంత్రి భార్య భవంతి నిర్మిస్తుందని వచ్చిన ఆరోపణలపై రోహిణి విచారణకు ఆదేశించారు. విచారణలో ఇది ప్రభుత్వ స్థలం కాదని.. నిబంధనల మేరకే కట్టారని తేలింది. ఆ తరువాత ఫిర్యాదు మేరకు స్పందించాల్సి వచ్చిందని తనది పొరపాటని రోహిణి, మంత్రికి లేఖ రాశారు. ఇదిలా ఉంటే ఇటీవల రోహిణి, మరో ఐఏఎస్ అధికారితో కలిసి మహేష్ తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఐపీఎస్ రూప స్పందిస్తూ.. మంత్రి వద్దకు రాజీకి వెళ్లడం నిబంధనలకు విరుద్ధం అంటూ విమర్శలు చేయడంతో ఒక్కసారిగా ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి వెళ్లింది.  సిన్సియర్ ఆఫీసర్ గా రోహిణికి పేరుంది. తెలుగు అమ్మాయి అయిన రోహిణి అక్రమాలపై ఉక్కుపాదం మోపింది.

Read Also: Turkey Earthquake: టర్కీలో మళ్లీ భూకంపం.. 6.4 తీవ్రతతో కంపించిన భూమి..

ప్రభుత్వం ఆగ్రహం.. చర్యలకు సీఎం ఆదేశం..

ఇదిలా ఉంటే వీరిద్దరి ప్రవర్తన కన్నడ ప్రభుత్వానికి చికాకులు తెప్పిస్తోంది. సివిల్ ఆఫీసర్లని మరిచి ఇద్దరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు చేసుకోవడంపై కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే ఈ ఇద్దరి వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ వందితా శర్మకు, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశాల జారీ చేశారు.

దీనిపై కర్ణాటక హోం మంత్రి అరాగ జ్ఞానేంద్ర స్పందిస్తూ.. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చొదని అన్నారు. సీఎం ఇప్పటికే సీఎస్, డీజీపీలో చర్చించారని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ లను ప్రజలు దైవసమానులగా చూస్తారని.. కానీ వారిద్దరు తమ హోదాలను అవమానిస్తున్నారని, వారి వ్యక్తిగత వైరమే ఇందులో కనిపిస్తోందని, వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలని, వీధి గొడవగా మార్చొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిణి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు కాగా, రూప స్వస్థలం కర్ణాటకలోని దావణగెరె.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Araga Jnanendra
  • CM Basavaraj Bommai
  • IAS vs IPS
  • karnataka
  • Roopa vs Rohini

తాజావార్తలు

  • Iran War: ‘‘హార్ముజ్‌ను మూసే ఉంచాలి’’.. కొత్త సుప్రీం లీడర్ ఆదేశాలు..

  • Srisailam: ఉగాది మహోత్సవాలకు ముస్తాబైతున్న శ్రీశైల మల్లన స్వామి.. 16 నుంచి ఐదు రోజుల పాటు ఘనంగా వేడుకలు.!

  • LPG Cylinder Delivery: రాష్ట్రంలో LPG సరఫరా నియంత్రణలోనే ఉంది.. ప్రభుత్వం కీలక ప్రకటన.!

  • Sugar Control : ఇలా వేయించిన శనగపప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్, షుగర్ కు చెక్

  • GHMC: గుడ్‌న్యూస్ చెప్పిన జీహెచ్ఎంసీ.. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట..

ట్రెండింగ్‌

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions