Revanth Reddy: యూపీఎస్సీ చైర్మన్తో సీఎం రేవంత్ భేటీ.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: దేశ రాజధాని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నిన్న ఏఐసీసీ కార్యక్రమంలో పాల్గొని ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు. టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసే లక్ష్యంతో ప్రభుత్వ చర్యలను ఆయన వేగవంతం చేశారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మరికొందరు సీనియర్ అధికారులు కలిశారు. UPSC పనితీరును గమనించి తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఇతర అంశాలపై సీఎం రేవంత్రెడ్డి, అధికారులు అధ్యయనం చేయనున్నారు. అయితే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొంతమంది ఐఏఎస్ల బృందం ఇప్పటికే యూపీఎస్సీ పరీక్షా సరళిని అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. కేరళ రాష్ట్రంలో పర్యటించిన బృందం ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కేసుపై సీఐటీ విచారణ చేపట్టింది.
Read also: Super Star Power Star: ఒకే వేదికపై ఈ ఇద్దరూ కలిసి కనిపిస్తే… మాటల్లేవ్-మాట్లాడుకోడాలేవ్
Also Read
- Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
ఈ కేసును విచారించిన సిట్ బృందం సభ్యులతో కూడా ఐఏఎస్ అధికారులు కేసుపై చర్చించనున్నారు. సిట్ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఐఏఎస్ అధికారులు నివేదిక సిద్ధం చేసారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే రానున్న రోజుల్లో గతంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్షల నిర్వహణకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టింది. గతంలో జరిగిన కొన్ని పరీక్షలను రద్దు చేశారు. మరికొన్ని వాయిదా పడ్డాయి. వీటిలో కొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కొత్త చైర్మన్ నియామకం తర్వాత ఈ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామాలపై గవర్నర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
MLA MS Babu: ఎమ్మెల్యే యూటర్న్..! ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైసీపీతోనే..!
తాజావార్తలు
-
Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
2027 వరల్డ్కప్కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
-
Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!