Revanth Reddy: యూపీఎస్సీ చైర్మన్తో సీఎం రేవంత్ భేటీ.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: దేశ రాజధాని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నిన్న ఏఐసీసీ కార్యక్రమంలో పాల్గొని ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు. టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసే లక్ష్యంతో ప్రభుత్వ చర్యలను ఆయన వేగవంతం చేశారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మరికొందరు సీనియర్ అధికారులు కలిశారు. UPSC పనితీరును గమనించి తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఇతర అంశాలపై సీఎం రేవంత్రెడ్డి, అధికారులు అధ్యయనం చేయనున్నారు. అయితే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొంతమంది ఐఏఎస్ల బృందం ఇప్పటికే యూపీఎస్సీ పరీక్షా సరళిని అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. కేరళ రాష్ట్రంలో పర్యటించిన బృందం ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కేసుపై సీఐటీ విచారణ చేపట్టింది.
Read also: Super Star Power Star: ఒకే వేదికపై ఈ ఇద్దరూ కలిసి కనిపిస్తే… మాటల్లేవ్-మాట్లాడుకోడాలేవ్
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఈ కేసును విచారించిన సిట్ బృందం సభ్యులతో కూడా ఐఏఎస్ అధికారులు కేసుపై చర్చించనున్నారు. సిట్ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఐఏఎస్ అధికారులు నివేదిక సిద్ధం చేసారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే రానున్న రోజుల్లో గతంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్షల నిర్వహణకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టింది. గతంలో జరిగిన కొన్ని పరీక్షలను రద్దు చేశారు. మరికొన్ని వాయిదా పడ్డాయి. వీటిలో కొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కొత్త చైర్మన్ నియామకం తర్వాత ఈ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామాలపై గవర్నర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
MLA MS Babu: ఎమ్మెల్యే యూటర్న్..! ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైసీపీతోనే..!
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!