Renukaswamy murder case: దర్శన్ కేసులో కీలక పరిణామం.. రంగంలోకి ఐటీ అధికారులు..
- దర్శన్ కేసులో కీలక పరిణామం..
- యాక్టర్ నివాసంలో సోదాలు చేసేందుకు అనుమతి కోరిన ఐటీ శాఖ..
- నేరానికి ఉపయోగించిన డబ్బులపై ఆరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renukaswamy murder case: అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం జైలులో ఉన్న యాక్టర్ దర్శన్ నివాసంపై దాడులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శన్ అభిమాని అయిన రేణుకాస్వామిని ఈ ఏడాది దర్శన్, పవిత్ర గౌడ, ఇతర సహాయకులు కలిసి హత్య చేశారు.
దర్శన్ ఇంట్లో పత్రాలను తనిఖీ చేయాల్సిందిగా ఐటీ అధికారులు మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు ధ్రువీకరించాయి. నేరానికి వినియోగించిన నగదుకు సంబంధించి దర్శన్ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఐటీ అధికారులు బళ్లారి జైలుకు వెళ్లారు. దర్శన్ నేరాన్ని కప్పిపుచ్చడానికి మరియు అతని తరపున లొంగిపోవడానికి కొంతమందికి రూ.30 లక్షలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఇతర నిందితులను చెల్లించేందుకు నటుడు దర్శన్ తన స్నేహితుల్లో ఒకరి నుంచి రూ. 40 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు హత్య కేసుకు సంబంధించిన ముందస్తు విచారణలో తేలింది. ఇదే విషయాన్ని దర్శన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించాడు.
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Read Also: UP: హిందువునని చెప్పి అమ్మాయిని ట్రాప్ చేసిన ముస్లిం.. తప్పించుకున్న యువతి
రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్తో పాటు పవిత్ర గౌడతో పాటు 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ ముగ్గురిపై హత్యా నేరాలు ఎత్తివేశారు. జూన్ 9న బెంగళూర్లోని సుమనహళ్లి వంతెన వద్ద 33 ఏళ్ల రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది. దర్శన్ అభిమాని అయిన స్వామి, తన అభిమాన నటుడు భార్యని విడిచి పవిత్ర గౌడతో సహజీవనం చేయడంపై ఆగ్రహంతో పవిత్ర గౌడకు సోషల్ మీడియా వేదిక అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడమే ఈ హత్యకు కారణమైంది. చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి ఓ షెడ్డుకు తీసుకువచ్చి నిందితులు దాడి చేశారు. మృతదేహంపై మొద్దుబారిన గాయాలతో పాటు వృషణాలు పగిలిపోయిన గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో జూన్ 11న నిందితులను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..