Renukaswamy murder case: దర్శన్ కేసులో కీలక పరిణామం.. రంగంలోకి ఐటీ అధికారులు..
- దర్శన్ కేసులో కీలక పరిణామం..
- యాక్టర్ నివాసంలో సోదాలు చేసేందుకు అనుమతి కోరిన ఐటీ శాఖ..
- నేరానికి ఉపయోగించిన డబ్బులపై ఆరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renukaswamy murder case: అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం జైలులో ఉన్న యాక్టర్ దర్శన్ నివాసంపై దాడులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శన్ అభిమాని అయిన రేణుకాస్వామిని ఈ ఏడాది దర్శన్, పవిత్ర గౌడ, ఇతర సహాయకులు కలిసి హత్య చేశారు.
దర్శన్ ఇంట్లో పత్రాలను తనిఖీ చేయాల్సిందిగా ఐటీ అధికారులు మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు ధ్రువీకరించాయి. నేరానికి వినియోగించిన నగదుకు సంబంధించి దర్శన్ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఐటీ అధికారులు బళ్లారి జైలుకు వెళ్లారు. దర్శన్ నేరాన్ని కప్పిపుచ్చడానికి మరియు అతని తరపున లొంగిపోవడానికి కొంతమందికి రూ.30 లక్షలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఇతర నిందితులను చెల్లించేందుకు నటుడు దర్శన్ తన స్నేహితుల్లో ఒకరి నుంచి రూ. 40 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు హత్య కేసుకు సంబంధించిన ముందస్తు విచారణలో తేలింది. ఇదే విషయాన్ని దర్శన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించాడు.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
Read Also: UP: హిందువునని చెప్పి అమ్మాయిని ట్రాప్ చేసిన ముస్లిం.. తప్పించుకున్న యువతి
రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్తో పాటు పవిత్ర గౌడతో పాటు 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ ముగ్గురిపై హత్యా నేరాలు ఎత్తివేశారు. జూన్ 9న బెంగళూర్లోని సుమనహళ్లి వంతెన వద్ద 33 ఏళ్ల రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది. దర్శన్ అభిమాని అయిన స్వామి, తన అభిమాన నటుడు భార్యని విడిచి పవిత్ర గౌడతో సహజీవనం చేయడంపై ఆగ్రహంతో పవిత్ర గౌడకు సోషల్ మీడియా వేదిక అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడమే ఈ హత్యకు కారణమైంది. చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి ఓ షెడ్డుకు తీసుకువచ్చి నిందితులు దాడి చేశారు. మృతదేహంపై మొద్దుబారిన గాయాలతో పాటు వృషణాలు పగిలిపోయిన గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో జూన్ 11న నిందితులను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..