అన్ని యాత్రలలో చార్ ధాయ్ యాత్ర ప్రత్యేకమైనది. అయితే ఈ సంవత్సరం ప్రారంభ నుంచే చార్ ధామ్ యాత్ర వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర మే 3న ప్రారంభించారు అధికారు. అయితే.. చార్ ధామ్ యాత్రకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని అధికారులు వెల్లడిస్తున్నారు. కేవలం నెల రోజుల్లోనే 14 లక్షల మందికి పైగా భక్తులు ఈ యాత్రకు వచ్చినట్లు ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ అధికారులు పేర్కొన్నారు. 2019లో 7 నెలల పాటు సాగిన చార్ ధామ్ యాత్రలో 34 లక్షల మంది భక్తులు హాజరైన రికార్డు ఉంది. అయితే.. కరోనా కారణంగా ఆ తర్వాత 2 ఏళ్లపాటు పాక్షిక యాత్రకు మాత్రమే అనుమతించారు అధికారులు. అయితే తాజా పరిస్థితులు దృష్ట్యా.. ఉత్తరాఖండ్ అధికారులు రెండేళ్ల అనంతరం పూర్తి స్థాయిలో చార్ ధామ్ యాత్ర ప్రారంభించారు.
దీంతో.. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ యాత్ర కోసం పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటికే 14 లక్షల మందికి పైగా యాత్రకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి ధామ్లకు యాత్ర రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే భారీ వెయిటింగ్ లిస్ట్ ఉన్నట్లు చెబుతున్న అధికారులు.. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహంతో తొలిసారిగా కేదార్నాథ్ ధామ్కు వెళ్లే మార్గంలో పాదచారుల కారణంగా రహదారి మార్గం మూసుకుపోయిందని తెలిపారు. ఇక యాత్రకు వస్తున్న వారిలో అత్యధిక మంది భక్తులు తమ బస ఏర్పాట్లను వెల్లడించడంలేదని, అధికారుల అంచనా ప్రకారం యాత్రకు వచ్చే పర్యాటకులు హోటళ్లు, హోమ్స్టేలలో బుకింగ్ చేయడం లేదని, ఎక్కడా బస ఏర్పాటు చేయకపోతే ప్రయాణం మానుకోవాలని ఇప్పటికే స్పష్టం చేసింది అధికార యంత్రాంగం.