ED Raids: హైదరాబాద్లో ఈడీ సోదాలు.. అమెరికన్లనే టార్గెట్గా మోసాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED Raids: హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న నకిలీ కాల్ సెంటర్ మోసాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరోసారి భారీ సోదాలు నిర్వహించారు. విదేశీ పౌరులు, ముఖ్యంగా అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన ముఠాపై మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ.. కీలక నిందితుడు వికాస్ నిమార్ను అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
పన్ను, రుణాల పేరుతో బెదిరింపులు..
దర్యాప్తులో భాగంగా నిందితులు అమెరికా ప్రభుత్వ విభాగాల అధికారులమని బాధితులను నమ్మించి, పన్ను బకాయిలు, రుణ బకాయిలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో ప్రమేయం ఉందంటూ భయపెట్టి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించి అమెజాన్ గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయించడం, డిజిటల్ చెల్లింపులు చేయించడం ద్వారా కోట్ల రూపాయలను అక్రమంగా సేకరించినట్లు విచారణలో తేలింది.
Also Read
- 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
- Ind vs SL: 'జడేజా' రీఎంట్రీ.. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.!
- AP Weather Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు!
- Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు.. 'ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు' నినాదంతో వేడుకలు!
క్రిప్టోకరెన్సీగా అక్రమ సంపాదన:
బాధితుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని బిట్కాయిన్తో పాటు ఇతర క్రిప్టోకరెన్సీలుగా మార్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అహ్మదాబాద్లో నిర్వహించిన సోదాల్లో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఆకిబ్ గులామ్ రసూల్ ఘాంచి వద్ద సుమారు 12 వేల డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీ, అలాగే రూ.13.5 లక్షల నగదు, కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో నాలుగు నెలల క్రితం హైదరాబాద్లోని పలు నకిలీ కాల్ సెంటర్లపై ఈడీ దాడులు నిర్వహించింది. తాజాగా హైదరాబాద్తో పాటు అహ్మదాబాద్లోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో కూడా సోదాలు చేపట్టింది. వేర్వేరు ప్రాంతాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ, అన్ని కేంద్రాల్లో ఒకే తరహా మోసపూరిత విధానాన్ని అనుసరించినట్లు ఈడీ గుర్తించింది.
మనీలాండరింగ్:
సైబరాబాద్ పోలీసులు, ఢిల్లీ సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ కేసులో మహమ్మద్ అన్సారి అలియాస్ మహమ్మద్ ఇర్ఫాన్ అన్సారి, ఆకిబ్ గులామ్ రసూల్ ఘాంచి, వికాస్ కె. నిమార్, దివ్యాంగ్ రావల్, ప్రదీప్ వి. రాథోడ్లను నిందితులుగా పేర్కొంది.
డ్రగ్స్ కేసులోనూ..
ఫేక్ కాల్ సెంటర్ కేసుతో పాటు మరోవైపు బెంగళూరులో డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ఈడీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. రెండు కేసుల్లోనూ దర్యాప్తు కొనసాగుతుండగా, మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
ED Raids: హైదరాబాద్లో ఈడీ సోదాలు.. అమెరికన్లనే టార్గెట్గా మోసాలు.!
-
Sridevi: వర్షంలో 15 ఏళ్ల శ్రీదేవితో 55 ఏళ్ల హీరో రొమాన్స్ .. అప్పట్లో సంచలనం సృష్టించిన కల్ట్ క్లాసిక్ సాంగ్ ఏంటో తెలుసా ?
-
Speed Post New Rates: తపాలా శాఖ కీలక ప్రకటన.. స్పీడ్ పోస్ట్ సేవలకు కొత్త ధరలు.. లేఖలు, పార్శిల్స్ పై కొత్త నిబంధనలు
-
Vaibhav Sooryavanshi-BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ.. బీసీసీఐకి పెద్ద తలనొప్పి!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
ట్రెండింగ్
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!