Fake DAP Fertilizer Scam: నకిలీ డీఏపీ ఎరువుల కలకలం.. ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake DAP Fertilizer Scam: తెలంగాణలో నకిలీ డీఏపీ (DAP) ఎరువుల వ్యవహారం కలకలం రేపుతోంది. రైతులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఎరువులను విక్రయిస్తున్న ముఠాపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) అధికారులను ఆదేశించారు. మరోవైపు నకిలీ ఎరువుల తయారీ, సరఫరా వెనుక ఉన్న ముఠాను గుర్తించేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
ప్రాథమిక విచారణలో ఈ నకిలీ డీఏపీ ఎరువులు కర్ణాటకలో తయారైనట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వాటిని తెలంగాణలోని పలు జిల్లాలకు తరలించి విక్రయించినట్లు అనుమానిస్తున్నారు. రైతులకు ఎలాంటి అనుమానం రాకుండా అసలైన డీఏపీ బస్తాలను పోలి ఉండేలా తయారు చేయడమే కాకుండా, వాటిపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను కూడా ముద్రించినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
వికారాబాద్ జిల్లా విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్పల్లిలో 106 నకిలీ డీఏపీ బస్తాలు గుర్తించారు. అలాగే పరిగి మండలం చిగురాల్పల్లిలో 25 మంది రైతులు మొత్తం 275 నకిలీ డీఏపీ బస్తాలు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.
కొంతమంది రైతులు ఇప్పటికే ఈ నకిలీ ఎరువులను తమ పొలాల్లో ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. మంచన్పల్లిలో లభ్యమైన 106 బస్తాలు, చిగురాల్పల్లిలో గుర్తించిన 27 బస్తాలను స్వాధీనం చేసుకుని చన్గోముల్, పరిగి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైతులు కొనుగోలు చేసిన నకిలీ డీఏపీపై విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణలో నకిలీ ఎరువుల ముఠా కొంతమంది సర్పంచ్లను అడ్డం పెట్టుకుని ఈ దందా నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు నకిలీ డీఏపీ ఎరువులను పొలాల్లో చల్లిన రైతుల చేతులకు బొబ్బలు వచ్చినట్లు సమాచారం.
తాజావార్తలు
-
iQOO 16: ఐకూ 16 అదిరిపోయే గేమింగ్ ఫోన్.. 8,500mAh బ్యాటరీ, 16GB RAM, 50MP ట్రిపుల్ కెమెరా!
-
The Traitors India Season 2: ట్రేటర్లే విజేతలు.. రూ.66 లక్షలు ప్రైజ్ మనీని కొట్టేసిన కిలాడి భామలు!
-
Sugar Price: సామాన్యులకు గుడ్న్యూస్! కేంద్రం సంచలన నిర్ణయం.. చక్కెర ధరలు దిగి వస్తాయా?
-
Vivo V80 Lite 5G: వివో వి80 లైట్ 5జీ వచ్చేసింది.. 10,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 16GB వరకు RAM!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!