Gujarat Elections: రవీంద్ర జడేజా భార్యకు… మోర్బీ ఘటనలో ప్రజల్ని కాపాడిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja Thanks PM After Wife Picked As Gujarat BJP Candidate: గుజరాత్ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 182 స్థానాలకు గానూ డిసెంబర్ 1, డిసెంబర్ 5వ తేదీన రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న ఫలితాలను ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే గురువారం 160 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ. దీంట్లో భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా పేరు కూడా ఉంది. దీంతో తమకు అవకాశం కల్పించినందుకు జడేజా ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పొందినందుకు నా భార్యకు అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశారు. రివాబా జడేజా జామ్నగర్ నార్త్ స్థానానికి బీజేపీ తరుపున పోటీలో నిలబడుతోంది.
Read Also: Rishi Sunak: సెమీఫైనల్ మ్యాచ్పై జోమాటో ట్వీట్.. రిషి సునాక్కి సంకట పరిస్థితి..
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
రివాబా జడేజా మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. కాంగ్రెస్ సీనియర్ హరి సింగ్ సోలంకికి బంధువు. 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకుంది. రాజ్ పుత్ కుటుంబానికి చెందిన రివాబాకు జామ్ నగర్-సౌరాష్ట్ర ఏరియాల్లో మంచి పట్టు ఉంది. కొన్ని నెలల నుంచి ఈ ప్రాంతంలో ఆమె పర్యటనలు చేస్తూ ప్రజలకు దగ్గర అవుతోంది. ఈ జాబితాలో పాటీదార్ ఉద్యమ నాయకుడు హర్దిక్ పటేల్ విరంగమ్ సీటు నుంచి బరిలోకి దిగనున్నారు. ఘట్లోదియా అసెంబ్లీ స్థానం నుంచి సీఎం భూపేంద్ర పటేల్, మజూరా నుంచి హర్ష్ సంఘవి బరిలోకి దిగనున్నారు.

ఇదిలా ఉంటే టికెట్ల కేటాయింపులో బీజేపీ సంచలన సృష్టించింది. ఇటీవల మోర్బీ జిల్లాలో వంతెన కూలి 140కి పైగా మంది ప్రజలు మరణించారు. అయితే ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలను కాపాడి హీరోగా నిలిచిన కాంతీలాల్ అమృతియా సాహసాన్ని ప్రశంసిస్తూ బీజేపీ అతనికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించి అందర్ని ఆశ్చర్య పరిచింది. ఘటన జరిగి సమయంలో కాంతీలాల్ ధైర్యంగా నదిలోకి దూకి పలువురిని కాపాడారు. అయితే ఈ సీటు నుంచి పోటీ చేయాలనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రిజేష్ మోర్జాకు నిరాశ మిగిలింది. దీంతో పాటు మాజీ సీఎం విజయ్ రూపానీ, మాజీ డిఫ్యూటీ సీఎం నితిన్ పటేల్ ఈ సారి పోటీకి దూరంగా ఉంటున్నట్లు బీజేపీ అధిష్టానికి లేఖ రాసినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థుల్లో 14 మంది మహిళలు, 13 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలు ఉన్నారు.
Jai hind 🇮🇳 pic.twitter.com/JWdbV0brab
— Ravindrasinh jadeja (@imjadeja) November 10, 2022
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?