Rajnath Singh: ప్రియాంకా గాంధీ “సీజనల్ హిందువు”.. కేంద్రమంత్రి విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: మరికొన్ని నెలల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ విమర్శలు ప్రారంభం అయ్యాయి. దీంతో పాటు పలువురు కాంగ్రెస్, బీజేపీ అగ్ర నేతలు మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ కి వెళ్లిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంగా గాంధీపై మంగళవారం విమర్శలు గుప్పించారు.
రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి ప్రజలను వచ్చించేందుకు కాంగ్రెస్ ఐదు హామీలను ఇస్తోందని ఆరోపించారు. రాజ్గఢ్లో జరిగిన ‘కిసాన్ కళ్యాణ్ మహాకుంభ్’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు రోజు ప్రియాంకా గాంధీ నర్మదా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రియాంకా గాంధీని ఉద్దేశిస్తూ రాజ్ నాథ్ సింగ్.. ‘‘ కాంగ్రెస్ లో కొందరు వ్యక్తులు సీజనల్ హిందువులుగా మారారు. ఇంతకు ముందు నర్మదా జీని ఎందుకు గుర్తుకు రాలేదని, ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది.’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారు ఇప్పుడు సమావేశాలు, కార్యక్రమాలు పెట్టి హనుమంతుడి గదను మోస్తున్నారని, ఇంతకుముందు వారు రాముడు, హనుమాన్ పేర్లను ఉచ్చరించే వారు కాదని ఆయన అన్నారు.
Also Read
Read Also: Mosquito Bite: దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా..? సబ్బు కూడా కారణం కావచ్చు..
కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టేందుకు ఐదు హామీలు ఇస్తామని చెబుతోందని, కమల్ నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ హామీలు ఇస్తుంది కానీ ఎప్పుడు నెరవేర్చదని రాజ్ నాథ్ సింగ్ విమర్శించారు. బీజేపీ హామీలను నెరవేరుస్తుందన్నారు. సీఎం శివరాజ్ సింగ్ కు ప్రజామద్దతు ఉందని, ఈసారి మరింత మెజారిటీతో మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ వ్యవసాయ బడ్జెట్ ను రూ. 25,000 కోట్ల నుంచి రూ. 1.25 లక్షల కోట్లకు పెంచిందని, రామమందిర నిర్మాణాన్ని చేపడుతోందని, రక్షణ రంగంలో అభివృద్ది చెందామని, మహిళ కోసం సైనిక్ స్కూల్స్ తో పాటు ఆర్మీలో మహిళలు ఎక్కువగా చేరుతున్నారని ఆయన అన్నారు. దేశంలో డిజిటల్ విప్లవం జరుగుతోందని ఆయన వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని 60 లక్షల ఇళ్లకు పైపుల ద్వారా నీటి సరఫరాను అందుబాటులోకి తెచ్చామని రక్షణ మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
-
Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
-
విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!