Rajnath Singh: డైనోసార్లకు పట్టిన గతే కాంగ్రెస్కి పడుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. ఉత్తరాఖండ్లో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ డైనోసార్ల లాగే మరికొన్నాళ్లలో అంతరించిపోతుందని, ఆ పార్టీలో అంతర్గం పోరు రియాల్టీ షో ‘బిగ్బాస్’ని తలపిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి నాయకుల వలసలు కొనసాగుతున్నాయని, వారు ఒకరి తర్వాత ఒకరు పార్టీని విడిచి బీజేపీలో చేరుతున్నారని చెప్పారు.
మరికొన్నేళ్లలో డైనోసార్ల లాగా కాంగ్రెస్ అంతరించిపోతుందేమో అని భయంగా ఉందని, 2024 తర్వాత కొన్నేళ్లలోనే కాంగ్రెస్ పేరు చెబితే, పిల్లలు ఎవరని అడుగుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒకరితో ఒకరు గొడవలు పడుతున్నారని, పార్టీ తీరు బిగ్బాస్ హౌజ్ లా మారిందని, వారు రోజూ ఒకరి బట్టలు ఒకరు చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో భారత్ బలమైన దేశంగా మారిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ తన వాణిని బలంగా వినిపిస్తోందని అన్నారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన 22,500 మంది భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో ప్రధాని మోడీ చర్చలు జరిపి నాలుగు గంటలకు పైగా యుద్ధాన్ని నిలిపేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
Read Also: Pakistan: మాపైనే రైడ్స్ చేస్తారా.? పోలీసులను చితక్కొట్టిన పాక్ ఆర్మీ.. వీడియో వైరల్..
ప్రపంచ భవిష్యత్తు చూడాలంటే భారత దేశానికి రావాలని భారత్తో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి చెప్పిన మాటల్ని కూడా ఆయన ఉటంకించారు. ప్రస్తుతం మనం మన రక్షణ పరికరాలను దేశంలోనే తయారు చేస్తున్నామని, గత 7 ఏళ్లలో రక్షణ రంగ ఎగుమతుల్ని రూ. 600 కోట్ల నుంచి రూ. 21,000 కోట్లకు పెంచామని చెప్పారు. బీజేపీ తాను చెప్పిన హామీలను యథాతథంగా అమలు చేస్తుందని చెప్పారు. ఇందుకు ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), అయోధ్య రామ మందిరం గురించి చెప్పారు. కాంగ్రెస్ వంటి పార్టీలు తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని, హామీల్లో 50 శాతం నెరవేర్చినా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండేదని అన్నారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్కు అరుదైన గౌరవం
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!