kidney Operation: ఎడమ కిడ్నీ బదులు, కుడి కిడ్నీ తొలగింపు.. మహిళ పరిస్థితి విషమం..
kidney Operation: రాజస్థాన్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలోని జుంజునులో కిడ్నీలో రాళ్లు ఉండటంతో మహిళను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ పాడైన ఎడమ కిడ్నీని తీయాల్సిన వైద్యులు, మంచిగా పనిచేస్తున్న కుడి కిడ్నీని శరీరం నుంచి తొలగించారు. తన భార్య ఆరోగ్యవంతమైన కిడ్నీని తొలగించారని భర్త ఆరోపించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తాను ఆపరేషన్ సరిగానే చేశానంటూ వైద్యుడు ఆ ఆరోపణల్ని కొట్టిపారేశారు. ధంఖర్ ఆస్పత్రిలో డాక్టర్ సంజయ్ ధంఖర్ ఈ ఆపరేషన్ చేశారు.
బాధితురాలని నువా గ్రామానికి చెందిన 30 ఏళ్ల ఈద్ బానోగా గుర్తించారు. ఆమె గత కొంత కాలంగా కిడ్నీ స్టోన్స్తో బాధపడుతోంది. దీని కారణంగా ఆస్పత్రికి వెళ్లారు. కొన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత, కిడ్నీలో రాళ్ల వల్ల కిడ్నీ పాడైపోయిందని, దానిని అత్యవసరంగా తొలగించాలని డాక్టర్ ధంఖర్, బానోకి తెలియజేశాడు. బానో కుటుంబం ఆపరేషన్కి అంగీకరించింది. మే 15న శస్త్రచికిత్స జరిగింది. అయితే, డాక్టర్ ధంఖర్ దెబ్బతిన్న ఎడమ కిడ్నీకి బదులుగా, ఆరోగ్యం ఉన్న కుడి కిడ్నీని తొలగించారని కుటుంబం ఆరోపించింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్..
ఆపరేషన్ జరిగిన రెండు రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్ ధంఖర్ ఆమెను జైపూర్లో చికిత్స కోసం తీసుకెళ్లాలని సూచించారు. మే 15న ఆమెకు జరిగిన ఆపరేషన్ గురించి ఎవరికీ చెప్పద్దని చెప్పిటన్లు బానో కుటుంబ చెప్పింది. ఆమెను సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రికి చేర్చినప్పుడు, వేరే మార్గం లేక ఆమెను ఇంటికి తిరిగి పంపించారు. వైద్యుల నిర్లక్ష్యం బయటపడటంతో డాక్టర్ ధంఖర్, బానో కుటుంబాన్ని కలుసుకుని, ఆమె వైద్యానికి డబ్బు చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. అయితే, ఆమె కుటుంబం ఈ ప్రతిపాదనను ఒప్పుకోకుండా, పోలీసులకు ఫిర్యాదు చేసింది. బానో భర్త షబ్బీర్ మాట్లాడుతూ.. కేసు నమోదు చేసి ధన్ఖర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డాక్టర్ మాత్రం బానో కుటుంబ ఆరోపణల్ని ఖండించారు. ఆమె కుడి కిడ్నీ పాడైపోయిందని, దాని కారణంగానే తొలగించానని చెప్పాడు. ఈ ఘటనపై చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ రాజ్కుమార్ డాంగీ ఐదుగురు సభ్యులతో కూడిన వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఆసుపత్రి రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.డాక్టర్ ధంఖర్ జుంజునులోని బీడీకే ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జన్గా చేరాడు, రోగి మరణించిన తర్వాత 2017లో సస్పెండ్ చేయబడ్డాడు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!