YouTube: యూట్యూబ్, చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ వాడి సొంత వైద్యం చేసుకుంటే ఎంత ప్రమాదమో ఈ ఘటన తెలియజేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీలో ఒక మహిళకు యూట్యూబ్లో చూసి ఆపరేషన్ చేశారు. దీంతో ఆమె చనిపోయింది. అక్రమంగా క్లినిక్ నడుపుతున్న వ్యక్తి, అతడి మేనల్లుడు యూట్యూబ్ ట్యుటోరియల్లో చూసిన తర్వాత ఆమెకు శస్త్రచికిత్స చేయడం ప్రారంభించారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె మరణించింది. Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘పార్టీల’’ లీడర్..…
Hospital Negligence: ములుగు జిల్లాలోని RVM ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోగికి కనీసం స్కానింగ్ చేయకుండానే, వేరే వ్యక్తికి సంబంధించిన ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్ను ఇచ్చి ఆస్పత్రి సిబ్బంది అడ్డంగా బుక్కైంది.
Cough Syrup Tragedy: కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ వల్ల అనేక మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చింద్వారాలో 24 మంది పిల్లల మరణాల కేసులో ఈ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అక్టోబర్ 8న, కోర్టు డాక్టర్ ప్రవీణ్ సోనికి బెయిల్ నిరాకరించింది. నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు దగ్గు సిరప్ ఇవ్వడాన్ని నిషేధించిన 2023 కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను వైద్యుడు పాటించలేదని కోర్టు పేర్కొంది. కోల్డ్రిఫ్ సిరప్ను పిల్లల ఔషధంగా…
వైద్యులను దైవంతో సమానంగా కొలుస్తుంటారు. అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న పలు ఘటనలు వైద్యులపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయంటున్నారు పలువురు వ్యక్తులు. తాజాగా గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఏఐజీలో చేరాడు. వైద్యం చేసేందుకు రూ. 35 లక్షల ప్యాకేజీ మాట్లాడుకున్నారని బాధిత కుటంబం తెలిపింది. బాధితులు ఇల్లు అమ్ముకుని మరి హాస్పిటల్ లో లక్షల్లో బిల్లు చెల్లించామని తెలిపారు. Also Read:Rashi Khanna :…
Tragedy : కురువపల్లి గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు వరుణ్ తేజ మృతితో సంబంధించి జడ్చర్లకు చెందిన న్యాయవాది, సామాజికవేత్త పెద్దింటి రవీంద్రనాథ్ జాతీయ బాలల హక్కుల సంఘం (NCPCR), భారత మానవ హక్కుల సంఘం (NHRC)లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం.. వరుణ్ తేజ ఆరోగ్యం బాగలేదని గుర్తించిన కుటుంబం, లింగంపేటలోని RMP డాక్టర్ శ్రీకాంత్ వద్దకు తీసుకువెళ్ళారు. అయితే సరైన వైద్యం అందించకపోవడం, డాక్టర్ నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడు. న్యాయవాది పెద్దింటి…
Supreme Court: చికిత్స తర్వాత రోగి కోలుకోకపోయినా లేదా మరణిస్తే వైద్యుడు బాధ్యత వహించలేడని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రసవం అనంతరం ఓ మహిళ మరణానికి వైద్యుడే(గైనకాలజిస్ట్) బాధ్యత వహించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో విచారణ సందర్భంగా, జస్టిస్ సంజయ్ కుమార్, సతీష్ చంద్రలతో కూడిన ధర్మాసనం.. సంచలన వ్యాఖ్యలు చేసింది. శస్త్రచికిత్స విజయవంతం కాకపోతే లేదా ఆశించిన ఫలితం సాధించకపోతే ఆ వైద్యుడిని నిందించడం సరికాదని పేర్కొంది. ఏ వివేకవంతమైన ప్రొఫెషనల్ వైద్యుడు ఉద్దేశపూర్వకంగా…
ఓ భర్త తన భార్యకు ఇంట్లోనే డెలివరీ చేశాడు.. దీంతో నవజాత శిశువు మరణించింది. తల్లికి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఇలానే చేసినట్లు అతడిపై పలు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..కేరళలోని పెరుంకలలోని అనకొంబన్లో ఒక పాస్టర్ తన భార్యకు సోమవారం ఇంట్లోనే ప్రసవం చేయడంతో నవజాత శిశువు మరణించింది. తల్లికి తీవ్ర రక్తస్రావం సంభవించింది. వైద్య సహాయం తీసుకోకుండా ఇంట్లోనే ప్రసవం చేయడం వలన…
ఉత్తరాఖండ్లో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఏడాది బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దర్యాప్తునకు ఆదేశించారు.
TX Hospital: హైదరాబాద్ బంజారాహిల్స్లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి TX హాస్పిటల్ లోని వైద్య నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాలుకు శస్త్రచికిత్స చేయించేందుకు ఆసుపత్రిలో చేరిన ఏడేళ్ల బాలుడు, ఆపరేషన్ అనంతరం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి వైద్యులపై ఆరోపణలు గుప్పించారు. ఇక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే.. Read Also:Students Letter: ఒక్కసారి మా స్కూల్కి రండి.. సీఎం, డిప్యూటీ సీఎం,…