Raj Thackeray: ఉద్ధవ్ ఠాక్రేకి బీజేపీ చెక్.. రాజ్ ఠాక్రేతో అమిత్ షా భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raj Thackeray: మహారాష్ట్ర పరిణామాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మెజారిటీ ఎంపీ సీట్లను కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఉద్ధవ్ ఠాక్రేకి చెక్ పెట్టేందుకు బీజేపీ భారీ ప్లాన్ సిద్ధం చేసింది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్, ఉద్ధవ్ ఠాక్రే కజిన్ రాజ్ ఠాక్రేని రంగంలోకి దించింది. ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్ ఠాక్రేతో భేటీ కావడంతో ఈ బీజేపీతో ఎంఎన్ఎస్ పొత్తు ఖరారైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎంఎన్ఎస్ దక్షిణ ముంబై, షిర్డీ, నాసిక్ స్థానానాలను డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజ్ ఠాక్రే తన తన కుమారుడు అమిత్ ఠాక్రేతో కలిసి ఢిల్లీలో అమిత్ షాతో సమావేశమయ్యారు. ఎంఎన్ఎస్ నాయకుడు సందీప్ దేశ్పాండే మాట్లాడుతూ.. ఏ నిర్ణయం తీసుకున్నా అది మరాఠీలు, హిందుత్వ ప్రయోజనాల కోసమే అని అన్నారు. దీంతో ఎన్డీయే కూటమిలో ఎంఎన్ఎస్ పార్టీ చేయడం దాదాపుగా ఖాయమైనట్లు తెలస్తోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే కూడా దేశ రాజధానిలో ఉన్నట్లు సమాచారం.
Also Read
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
- West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
- Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
- West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
Read Also: Supreme Court: CAAపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ.. 3 వారాల్లో స్పందించాలని కేంద్రానికి ఆదేశం..
రాజ్ ఠాక్రేతో ఉద్ధవ్ ఠాక్రేకి చెక్:
2019లో శివసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికలకు వెళ్లాయి. మహారాష్ట్రలోని 48 స్థానాల్లో 41 సీట్లు గెలుచుకుంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం ఇరు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. దీంతో బీజేపీని కాదని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ, కాంగ్రెస్లతో జతకట్టి ‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’ కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే 2022లో ఏక్ నాథ్ షిండే శివసేనలో తిరుగుబాటు తీసుకువచ్చాడు. మెజారిటీ ఎమ్మెల్యేలు షిండే వైపు ఉండటంతో ప్రభుత్వం పడిపోయి, మళ్లీ బీజేపీ, షిండే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మరోవైపు, ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు చేసి ఆయన వర్గం కూడా బీజేపీ ప్రభుత్వంలో చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ-శివసేన(షిండే)- ఎన్సీపీ(అజిత్ పవార్) కూటమి అధికారంలో ఉంది.
మహారాష్ట్రలో ఠాక్రే ఫ్యాక్టర్ని ఎదుర్కోవాలంటే మరో ఠాక్రే కావాలని బీజేపీ భావిస్తోంది. దీంతో ఉద్ధవ్ ఠాక్రేకి చెక్ పెట్టేందుకు బీజేపీ రాజ్ ఠాక్రేని తెరపైకి తీసుకువచ్చింది. ఈ సారి ఎన్డీయే కూటమి ఎలాగైనా 400 స్థానాలు సాధించాలని, సొంతగా బీజేపీ 370 స్థానాలు సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
Instant Onion Mixture: ఈ చిట్కా తెలిస్తే బయట ఫుడ్ అస్సలు కొనరు.. కేవలం 2 నిమిషాల్లో నోరూరుంచే స్నాక్ రెడీ!
-
Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
Telangana Govt: గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
-
Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?