Mumbai: 20 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్ర.. ఒకే వేదిక పంచుకున్న థాక్రే బ్రదర్స్
- మహారాష్ట్ర రాజకీయాల్లో నూతన అధ్యయనం
- 20 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్ర
- ఒకే వేదిక పంచుకున్న థాక్రే బ్రదర్స్
- ఫడ్నవిస్ పుణ్యంతో కలిశామని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో నూతన అధ్యయనం వెలుగుచూసింది. దాయాదులుగా ఉన్న అన్నాదమ్ముళ్లిద్దరూ 20 సంవత్సరాల తర్వాత ఒక్కటయ్యారు. మరాఠీ భాష కోసం ఒకే వేదిక పంచుకున్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లోనే ఇది సరికొత్త చరిత్రగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఇది కూడా చదవండి: 2025 Bajaj Dominar 400: బజాజ్ నుంచి స్పోర్ట్స్ టూరింగ్ బైక్ సిరీస్ విడుదల.. ధర ఎంతంటే?
Also Read
- PM Narendra Modi: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ట్రంప్కు, అమెరికా ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
- Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం 1-5 తరగతుల్లో హిందీని తప్పనిచేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై విపక్ష పార్టీలన్నీ భగ్గుమన్నాయి. బలవంతంగా హిందీ రుద్దడమేంటి? అని నిలదీశాయి. తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జూన్ 17న హిందీని ఐచ్ఛిక భాషగా చేస్తూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సవరించింది.
ఇది కూడా చదవండి: Bhumana Karunakar Reddy: జగన్ను చూస్తేనే కూటమి నేతలకు భయం.. అందుకే అడ్డుకునే ప్రయత్నం..!
ఇక మరాఠీ భాష కోసం థాక్రే బ్రదర్స్ ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే నడుం బిగించాయి. అమ్మలాంటి మరాఠీ భాషను రక్షించుకుంటామంటూ నినదించారు. ఇందులో భాగంగా శనివారం ‘మరాఠీ విజయ్ దివాస్’ పేరుతో భారీ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఆందోళనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అంతేకాకుండా 20 ఏళ్ల తర్వాత అన్నాదమ్ములిద్దరూ కలవడంపై సర్వత్రా ఆసక్తి చోటుచేసుకుంది. స్థానిక మీడియాతో పాటు జాతీయ మీడియాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఇక విడిపోవడానికి కలవలేదని.. కలిసి ఉండడానికి కలిశామంటూ ఉద్ధవ్ థాక్రే అన్నారు. ముంబై మున్సిపల్ ఎన్నికల కోసమే కలిశారంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధమని.. తాము కలిసి పోరాడానికే కలిశామని… కలిసే మరాఠీ భాష కొట్లాడతామని వెల్లడించారు. అయినా కొందరు మమ్మల్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించారు.
ఇక విభజన సృష్టించే ప్రయత్నాలను తాము ఐక్యంగా ఎదుర్కొంటామని రాజ్ థాక్రే తెలిపారు. బాలాసాహెబ్ థాక్రే వల్ల కానిది.. ఫడ్నవిస్ పుణ్యమా? అంటూ ఉద్ధవ్ను తనను కలిపారంటూ వ్యాఖ్యానించారు.
महाराष्ट्राने मनात जपलेला सुवर्णक्षण…! pic.twitter.com/kugbSPx0JU
— ShivSena – शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) July 5, 2025
Mumbai: Shiv Sena (UBT) Chief Uddhav Thackeray says, "We have come together to stay together"
Uddhav Thackeray faction (UBT) and Maharashtra Navnirman Sena (MNS) are holding a joint rally at Worli Dome in Mumbai, after the Maharashtra government scrapped two GRs to introduce… pic.twitter.com/h9X4gs5VTg
— ANI (@ANI) July 5, 2025
తాజావార్తలు
-
Deewana OTT Deal: కంటెంట్పై నమ్మకం.. నిర్మాతలకు రూ.7 కోట్ల జాక్పాట్!
-
Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
-
Kiran Abbavaram: థియేటర్ల నుంచి బయటకొచ్చాక నెలల తరబడి గుర్తుంటుంది.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం ప్రామిస్!
-
CM Chandrababu: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు సేఫ్.. రంగంలోకి సీఎం చంద్రబాబు..!
-
Vaibhav Sooryavanshi: ‘మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను’.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!