Rahul Gandhi: కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. దాని వల్ల కరెన్సీ విలువ పడిపోతుంది!
- క్రోనీ క్యాపిటలిజం విధానాలకు మోడీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది..
- మోడీ అవలంభించే చర్యలతో దేశంలో తయారీ రంగం బలహీనపడుతుంది..
- ఎన్డీయే ప్రభుత్వ విధానంతో దేశ కరెన్సీ విలువ పడిపోతుంది: రాహుల్ గాంధీ
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ పారదర్శకంగా వ్యవహరించకుండా, చట్ట ప్రకారం జరిగే వ్యాపారాలను పట్టించుకోకపోవడంతో.. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ అవలంభించే ఇలాంటి చర్యలతో దేశంలో తయారీ రంగం రోజురోజుకు మరింత బలహీనపడుతోంది, కరెన్సీ విలువ క్రమంగా పడిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, రికార్డు స్థాయిలో గరిష్ఠ వాణిజ్య లోటు, అధిక వడ్డీ రేట్లు పెరిగాయని పేర్కొన్నారు. వస్తువుల వినియోగం తగ్గి ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివి చూస్తున్నామని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
Read Also: Seethakka In Assembly: గురుకులాల్లో కలుషిత ఆహార ఘటనలపై స్పందించిన మంత్రి సీతక్క
Also Read
అయితే, దేశంలో వాణిజ్య లోటు, దిగుమతులు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోతున్నాయని వస్తున్న వార్తా కథనాలను గుర్తు చేస్తూ.. కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాలు క్రోనీ క్యాపిటలిజం విధానాలకు ప్రాధాన్యమిస్తే ఎలా అని ప్రశ్నించారు. గత నవంబరులో దేశీయ వాణిజ్య ఎగుమతులు ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే 4.85 శాతం తగ్గి 32.11 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాని చెప్పుకొచ్చారు. అలాగే, దిగుమతులు 27 శాతం పెరిగి రికార్డు స్థాయి 69.95 బిలియన్ డాలర్లకు చేరుకుందని పేర్కొన్నారు. దీంతో వాణిజ్య లోటు 37.84 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు. ఇది జీవనకాల గరిష్ఠ స్థాయి అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పుడేనా?
-
Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!